Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు. తమ కులం విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్దంగా ఉన్నామని, జాతీయ స్థాయి కమిషన్ మాత్రమే కాదు.. ఏ కమిటీతో అయినా విచారణకు రెడీ అని సవాల్ విసిరారు.
గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ..తన తండ్రి కడియం శ్రీహరి కులం పై ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ సారి చర్చ జరుగుతోందని నిజానికి ఆయన గడచిన 40 ఎళ్లుగా ఇప్పుడున్న కులం సర్టిఫికెట్ తోనే ప్రజా ప్రతినిధిగా ప్రజలకు సేవ చేశారన్నారు. అప్పుడు లేని వివాదం ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకువచ్చారని ప్రశ్నించారు.
తాను దళిత మహిళగా, వైద్యురాలిగా సమాజ సేవకురాలిగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో ఎన్నికల బరిలో నిలిచానన్నారు. కడియం శ్రీహరి దళితుడో కాదో నిరూపించుకోవాలని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కావ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదూరి రమేష్ కులం ప్రస్తావన తెచ్చి రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు కావ్య.
Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా