YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. యనమల కృష్ణుడుతో పాటు వైసీపీలో చేరిన వారిలో టీడీపీ నేతలు పీ శేషగిరిరావు, పి హరికృష్ణ, ఎల్ భాస్కర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు.
వైసీపీలో చేరిన తర్వాత యనమల కృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ .. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్ఆర్ఐలకే టిక్కెట్లు ఇచ్చారని అన్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్న వాళ్లను మోసం చేశారని మండిపడ్డారు. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నా చంద్రబాబు, యనమల రామకృష్ణుడు మోసం వల్లే తనకు అన్యాయం జరిగిందని అన్నారు.
చంద్రబాబు బీసీలను మోసం చేశారు అనడానికి తానే ఉదాహరణ అని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోగా, ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనను చూసి వైసీపీలో చేరడం జరిగిందన్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా గెలుపునకు కృషి చేస్తానని యనమల కృష్ణుడు తెలిపారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడైన యనమల కృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు తుని నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి రాజా చేతిలో ఓటమి పాలైయ్యారు. ఈ సారి ఎన్నికల్లోనూ టీడీపీ నుండి పోటీ చేయాలని ఆశించినా సోదరుడు రామకృష్ణుడు కుమార్తె దివ్యకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. దీంతో టీడీపీ పై అసంతృప్తితో నిన్న రాజీనామా చేశారు. ఇవేళ వైసీపీలో చేరారు.
YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!