Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను ఈడీ వ్యతిరేకించింది. ఆయన ఎన్నికల ప్రచారం చేసే హక్కు .. ప్రాధమికమైనది కాదని స్పష్టం చేసింది. అలానే రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని, న్యాయపరమైన హక్కు కూడా కాదని ఈడీ పేర్కొంది. ఈ మేరకు గురువారం సుప్రీం కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏ రాజకీయ పార్టీ నాయకుడికి మద్యంతర బెయిల్ మంజూరు చేసిన దాఖలాలు లేవని ఈడీ తన అఫిడవిట్ లో పేర్కొంది. అదీ కాక ఆయన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధి కూడా కాదని వివరించింది. గతంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమన్లు తప్పించుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ .. ఈ తరహా పద్ధతిని అనుసరించారని తన అఫిడవిట్ లో ఈడీ గుర్తు చేసింది.
ఒక వేళ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు ప్రత్యేక రాయితీ తో మద్యంతర బెయిల్ మంజూరు చేస్తే అది చట్టం పరిధి దాటినట్లు అవుతుందని పేర్కొంది. అనైతిక రాజకీయ నాయకులు ఎన్నికల ముసుగులో దర్యాప్తు నుండి తప్పించుకొనేందుకు మద్యంతర బెయిల్ పేరిట ప్రయత్నిస్తారని ఈడీ ఆరోపించింది.
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో ఈడీ, కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును శుక్రవారానికి రిజర్వు చేసింది. ఒక వేళ అరవింద్ కేజ్రీవాల్ కు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తే అధికారిక విధుల్లో పాల్గొనడం గానీ.. ఫైళ్లపై సంతకాలు కానీ చేయకూడదంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య