Breaking: విజయవాడ గురునానక్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థోపెడిక్ వైద్యుడు శ్రీనివాస్ కుటుంబంలో అయిదుగురు మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంలో అయిదుగురు మరణించడంతో ఇది హత్యా.. ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వైద్యుడు డి శ్రీనివాస్ ఇంటి బయట ఉరివేసుకొని మృతి చెందినట్లు ఉండగా, ఇంటి లోపల ఆయన భర్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు కనిపించాయి. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఘటనా ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన