Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం ధర్మాసనం సీరియస్ అయ్యింది. అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎస్జీటీ) తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ ను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మే 10 వ తేదీకి వాయిదా వేస్తూ.. అక్రమ ఇసుక తవ్వకాలపై తీసుకున్న చర్యలపై మే 9వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖను ఆదేశించింది.
అలానే ఏపి ప్రభుత్వం కూడా అదే తేదీలోపు అక్రమ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలునకు సమయం కావాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా..ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని వ్యాఖ్యానించింది.
BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత