పార్టీలు ఏవైనా.. అభ్యర్థులను ఎంచుకునేముందే.. అన్నీ పరిశీలిస్తాయి. అన్ని కోణాల్లోనూ సరిచూసుకుం టాయి. వారి సత్తా ఎంత? వారు ఏమేరకు విజయం దక్కించుకుంటారని పరిశీలిస్తాయి. అందుకే. ఇటు టీడీపీ అయినా.. అటు వైసీపీ అయినా. అనే క సర్వేలు చేసిన తర్వాతే.. నాయకులకు టికెట్లు ఇచ్చాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన వారికి కూడా.. ఇవ్వకుండా పక్కన పెట్టడానికి కారణం.. ప్రత్యర్థులు బలంగా ఉండడమే.
కానీ, అదేంటో వైసీపీ ఈ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రెండు కీలక నియోజకవర్గాల్లో మాత్రం తప్పటడుగులు వేసిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఆ రెండు బలమైన నియోజకవర్గాలు కాగా.. అక్కడ వైసీపీ బలహీనమైన అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. వారే.. అద్దంకిలో పాణెం చిన్న హనిమిరెడ్డికి అవకాశం ఇచ్చింది వైసీపీ. ఇక, మరో బలమైన నియోజకవర్గం.. పరుచూరు. ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ విజయం దక్కించుకుంటోంది.
ఇలాంటి చోట బలమైన అభ్యర్థిని నిలబెట్టాల్సిన వైసీపీ ప్రయోగాలపై ప్రయోగాలు చేసింది. ఈ క్రమంలోనే పార్టీలో ఒకసారి ఉండి.. మళ్లీ వెళ్లిపోయిన ఎడమ బాలాజీని పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ అసలు ఎడమ బాలాజీ ఏమాత్రం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని.. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులే చెబుతున్నారు.కానీ, అధిష్టానంమత్రం ఆయనను ఎంపిక చేసింది. ఇక, నియోజకవర్గాల పరిస్తితిని గమనిస్తే.. అద్దంకిని టీడీపీకి కంచుకోటగా మార్చడంలో గొట్టిపాటిరవి సక్సెస్ అయ్యారు.
ఒకవైపు.. తన బలం.. మరోవైపు .. పార్టీ బలంతో ఆయన వరుసగా నాలుగోసారి బరిలో నిలిచారు. ప్రజానా యకుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇక, హనిమిరెడ్డి నాన్ లోకల్ కావడంతో ఇక్కడ వైసీపీ నేతలే ఆయ నకు ముఖం చాటేస్తున్న పరిస్థతి కనిపిస్తోంది. అదేవిధంగా పరుచూరులో అసలు ఏమాత్రం పోటీఇచ్చే పరిస్థితిలో ఎడమ బాలాజీ కనిపించడం లేదు. గతంలో ఈయన ఇక్కడ కేడర్ కలిసి రాకపోవడంతోనే వెల్లిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది.
అయినా.. వైసీపీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. సో.. ఎలా చూసుకున్నా.. ఈ ఇద్దరు నాయకులు, ఆ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ పరాజయం ఎన్నికలకు ముందే తేలిపోయిందని అంటున్నారు పరిశీలకులు.