TDP: తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్ధులపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు తెలిపారు. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహం, విజయనగరానికి చెందిన మీసాల గీత, అమలాపురానికి చెందిన పరమట శ్యామ్ కుమార్, పోలవరానికి చెందిన ముడియం సూర్యచంద్రరావులపై సస్పెనషన్ వేటు వేశారు.
ఉండి నియోజకవర్గం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, సత్యవేడుకు చెందిన జడ్డా రాజశేఖర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. వీరు టీడీపీ నిబంధనలను అతిక్రమించారని ఆయన తెలిపారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు