Trinayani April 30 2024 Episode 1226: ముదురు బెండవి నువ్వు అమ్మతో అలాగేనా మాట్లాడేది అని లలిత దేవి అంటుంది. నువ్వు కూడా అమ్మ అంటున్నవ్ ఏంటక్కా అని తిలోత్తమ అంటుంది. బిడ్డ గురించి తల్లికి తెలియదా అందుకే అమ్మ అని పిలుస్తున్నాం అని లలిత దేవి అంటుంది. ఇంట్లోకి అడుగుపెట్టేముందు అమ్మకు పాదాలు లేవు అడిగేలా పెడుతుంది అన్నారు ఆ సంగతి ఏంటి అని తిలోత్తమ అంటుంది. విశాలాక్షి నడుచుకుంటూ వచ్చాక ఇంకా ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకు అని విశాల్ అంటాడు. నీ డ్రెస్ కాస్త పైకినమ్మ నీ పాదాలు ఉన్నాయో లేవో చూస్తాం అని వల్లభ అంటాడు. ఎవరు పరీక్షించదలిస్తే వాళ్లే వెళ్లి చూడండి అని గురువుగారు అంటారు. నేను తీస్తాను అని వల్లభ అంటాడు.
ఆడపిల్ల పదాలు చూస్తావా అసలు నీకు బుద్ధుందా అని హాసిని అంటుంది. నేను చూస్తాను ఉండండి అని తిలోత్తమ అంటుంది.అమ్మ నువ్వు పట్టుకున్న కలశం ఇవ్వు అది పట్టుకునినా పాదాలను చూడాలి అని విశాలాక్షి అంటుంది. దిష్టి సామాన్లను నేనెందుకు పట్టుకుంటాను అని తిలోత్తమ అంటుంది. వాటి పరమార్థం ఏంటో తెలియాలి కద తిలోత్తమ అని గురువుగారు అంటారు. అంతా అమ్మ దయ అర్థం చేసుకొని మూర్ఖులకి ఏం చెబుతాం అని లలితాదేవి అంటుంది.తిలోత్తమ వెళ్లి విశాలాక్షి లంగానీ పక్క కని పాదాలు చూడబోతోంది. ఇంతలో గాయత్రి పాపా నైని చేతిలో ఉన్న మూటని కింద పడేస్తుంది.పాదాలని చూడబోయే నా తిలోత్తమ కి గుర్రం పాదాలు కనిపిస్తాయి. వాటిని చూసి షాక్ అవుతుంది తిలోత్తమ. ఇంతలో గుర్రం సౌండ్ అందరికీ వినపడుతుంది. వాయువు అని తిలోత్తమ గుర్రం పాదాలని చూస్తూ అంటూ ఉండగా ఆ పాదాలతో తిలోత్తమని వాయువు కన్నేస్తాడు. అలా తన్నేసావ్ ఏంటి అని సుమన అంటుంది. వాయువే తనని తన్నింది అని లలితా దేవి అంటుంది. అమ్మో నొప్పి అని తిలోత్తమ తల్లడిల్లుతుంది.
గురువుగారు అమ్మకి గుండెల్లో నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది ఏం చేయమంటారు అని విశాల్ అంటాడు. తులసి రసాన్ని నోట్లో పోయండి తగ్గిపోతుంది అని గురువుగారు చెబుతారు. తనని లోపలికి తీసుకువెళ్లండి గాయత్రీ దేవి జాడని చూడాలంటే బ్రతికి ఉండాలి కదా అని విశాలాక్షి అంటుంది. వల్లభ విక్రాంత్ తన గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెడతారు. కట్ చేస్తే, ఏం ఆలోచిస్తున్నావ్ రా అని తిలోత్తమ అడుగుతుంది. గుర్రానికి నాలుగు పాదాలు కదా మమ్మీ ఉండేది విశాలాక్షికి రెండు పాదాలు ఎలా ఉన్నాయి అని వల్లభ అంటాడు. తనేదో గారడి చేసి ఉంటుందిరా కానీ గుండెల్లో నొప్పిగా ఉంది అని తిలోత్తమ అంటుంది. మమ్మీ విశాలాక్షి గుర్రం పాదాలతో తనినప్పుడు తన కింద పడిపోవాలి కదా అని వల్లభ అంటాడు. తన కాళ్ళ మీద నిలబడి ఉంటుంది లేరా నన్ను విసిగించకు నొప్పి ఎక్కువగా ఉంది అని తిలోత్తమ అంటుంది. ఇంతలో హాసిని తులసీదళం రసం తీసుకొని వస్తుంది. నువ్వెందుకు వచ్చావే అని తిలోత్తమ అంటుంది. ఈ తులసి రసం తాగితే అరగంటలో రిలీఫ్ అవుతవు అని హాసిని అంటుంది. అది నాకొద్దు చేదుగా ఉంటుంది అని తిలోత్తమ అంటుంది. మీ అమ్మ అలాగే అంటుంది పట్టుకోండి అని హాసిని అనగానే వల్లభ కాళ్లు పట్టుకుంటాడు హాసిని తులసి రసం నోట్లో పోస్తుంది. బలవంతంగా హాసిని తిలోత్తమా కి తులసి రసం తాపిస్తుంది.
సారీ మమ్మీ తప్పలేదు అని వల్లభ అంటాడు. ముందు దీన్ని పట్టుకోరా అని తిలోత్తమ అనగానే హాసిని పారిపోతుంది. కట్ చేస్తే, అమ్మ జాడ తెలుస్తుందని భయమేస్తుంది అని విశాల్ అంటాడు. పాపం ని తీసుకొని పారిపో అని హాసిని అంటుంది. బాగోదేమో వదిన అని విశాల్ అంటాడు. సహాయం చేయాల్సిన గురువుగారు ఇలా చేస్తున్నారు అర్థం కావట్లేదు అని హాసిని అంటుంది. తను మాత్రం ఏం చేస్తాడు వదిన అని విశాల్ అంటాడు. గాయత్రి పాపను గుర్తుపట్టకుండా పౌడర్ కొట్టేస్తే అని హాసిని అంటుంది. ఫొటోస్ ఎవరు తీయట్లేదు వదిన అలా పౌడర్ ఉండడానికి అని విశాల్ అంటాడు. ఏంటమ్మా తల్లి అలా చూస్తున్నావ్ నిన్ను కాపాడుకోవడం కష్టమైపోతుంది అని హాసిని అంటుంది. అమ్మని కాపాడుకోవడానికి ఇప్పుడే ఒక ప్లాన్ వచ్చింది వదిన అని విశాల్ హాసినితో చెబుతాడు. ఇలా చేస్తే గాయత్రిని అనుమానించకుండా చేయొచ్చు అని హాసిని అంటుంది. అమలు చేయాల్సింది నువ్వు ఆ తరువాత ఏం చేయాలో విశాలాక్షిని అడుగుదాం అని విశాల్ అంటాడు.
ఆ అమ్మలగన్నా అమ్మే సహాయం చేస్తుంది నిన్ను కొత్తగా చేస్తే తప్ప కాపాడుకోలేం అని గాయత్రి పాపని ఎత్తుకొని వెళ్తుంది హాసిని. కట్ చేస్తే, లలితా దేవి పూజ చేస్తుంది. పౌర్ణమి సమయంలో దీపారాధన చేయడం చాలా సంతోషం అని గురువుగారు అంటారు. చాలా సంతోషంగా ఉంది గురువుగారు అని విశాలాక్షి అంటుంది.నీ ముందు దీపాలు పెట్టి దీపావళి చేసుకున్నాం అనుకుంటున్నావా అని వల్లభ అంటాడు.వల్లభ మీ అమ్మ పొద్దున గుండెపోటుతో పడ్డట్టు నువ్వు కూడా పడాలనుకుంటున్నావా జాగ్రత్తగా మాట్లాడు అని లలితాదేవి అంటుంది. విశాలాక్షి పాప తన్నడం మేము అందరం చూసాం మీరేమో వాయువు అంటున్నారు అని సుమన అంటుంది. నేను నిలబడ్డ చోటే ఉన్నాను ఎవరిని తన లేదు అని విశాలాక్షి అంటుంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని తిలోత్తమ అంటుంది. పెద్దమ్మ ఎప్పుడు కనిపిస్తుంది అని విక్రాంత్ అంటాడు.
ఎప్పుడు రెడీ అయితే అప్పుడు అని హాసిని అంటుంది. ఎవరు రెడీ కావాలా అక్క అని నైని అడుగుతుంది. మనం పూజ చేస్తే అమ్మ నీడ కనిపిస్తుందని వదిన చెబుతుంది అని విశాల్ అంటాడు. ఈ సమయంలో పిల్లలు లేకపోవడమే మంచిది అని పావనమూర్తి అంటాడు. పిల్లలు ఉంటే పని చేయనివ్వరు కదా అని హాసిని అంటుంది. గాయత్రి పాప పడుకుందా అక్క అని నైని అడుగుతుంది. బాగా మేకప్ వేసి పడుకోపెట్టాను అని హాసిని అంటుంది. చేసిన అల్లరి చాలు భగవంతుడికి దండం పెట్టుకో అని లలితా దేవి అంటుంది. అమ్మ శక్తి స్వరూపిణి నాకు శక్తినివ్వు అని హాసిని అంటుంది. నువ్వు ఎంత తిన్న అలాగే ఉంటావు లలిత దేవి అక్క హాసిని ఇక్కడ ఉంటే పని జరగదు పంపించేసేయ్ అని తిలోత్తమ అంటుంది. నేను గాయత్రి అత్తయ్య ఈ జన్మలో ఎలా ఉంటుందో చూడకూడదా అని హాసిని అంటుంది. ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే చూస్తావు అని లలితా దేవి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది