AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో అభ్యర్ధుల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో ఏ స్థానంలో ఎంత మంది బరిలో ఉన్నారనే దానిపై క్లారిటీ వచ్చింది. అయితే నామినేషన్లు ఉపసంహరణ ముగిసిన తర్వాత స్వతంత్ర అభ్యర్ధులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు జరిగింది. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ఫ్రీసింబల్ జాబితాలో ఉండటంతో పలువురు స్వతంత్రులకు ఆ గుర్తు కేటాయించారు. ఈ పరిణామం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి కొత్త తలనొప్పి తెచ్చినట్లు అయ్యింది.
టీడీపీ, జనసేన, బీజేపీ నుండి టికెట్ లు ఆశించి భంగపడిన పలువురు నేతలు ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ రెబల్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పోటీలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ టికెట్ ను పార్టీ అధిష్టానం పూసపాటి అదితి గజపతిరాజుకు కేటాయించడంతో మీసాల గీత అసంతృప్తికి గురై స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్ధిగా ఉన్న మీసాల గీత కు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీ కేవలం 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లోనే పోటీ చేస్తొంది. దీంతో జనసేన అభ్యర్ధులు పోటీ లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధుల కోరిక మేరకు గాజు గ్లాస్ గుర్తును అధికారులు కేటాయించారు.
ఇదే క్రమంలో జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యర్ధి సూర్యచంద్రకు ఈసీ గ్లాస్ గుర్తు కేటాయించింది. అలానే ఎస్ కోట లో జనసేన రెబల్ అభ్యర్ధి కొట్యాడ లోకాభిరామకోటి గాజు గ్లాస్ గుర్తుతో పోటీకి దిగుతున్నారు. మరో వైపు .. కూటమి అభ్యర్ధులకు పలు నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద నెలకొని ఉంది. విజయనగరం, ఉండి, పోలవరం, పెనుగొండ, హిందూపురం నియోజకవర్గాల్లో రెబల్స్ బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్ధులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తుండటంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు.
BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం