Madhuranagarilo April 12 2024 Episode 336: పండుని మనం ఇప్పుడు కాపాడుకోలేమా అని అంటుంది మధుర. అదే నాకు కూడా అర్థం కావడం లేదు అత్తయ్య అని అంటుంది రాధ. లేదు ఇలాగైనా కాపాడుకోవాలి పండుని అని అంటుంది.మధుర ఏడుస్తూ ఉండగా పండుకి ఎలాగైనా ఆపరేషన్ జరుగుతుంది అని అంటుంది రాధ. ధనుంజయ్ కోపంతో పండుకి ఆపరేషన్ జరుగుతుంది అని అంటాడు. ఆపరేషన్ ఎలా జరుగుతుంది మనకి పాతిక లక్షలు ఇచ్చేది ఎవరు అని అంటుంది మధుర. రుక్మిణి ఇస్తుంది అని ధనుంజయ్ అంటాడు. మనకు ఈ పరిస్థితి రావడానికి కారణం రుక్మిణి అలాంటి దాని దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతారా ఆస్తి మనకు అక్కర్లేదు అని దాని మొహం కొట్టి వచ్చాము ఇప్పుడు దాని దగ్గరికి వెళ్లి అడుగుతారా అని అంటుంది మధుర. నన్ను ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం వద్దనుకున్న దాని దగ్గరికి వెళ్లి అడగడమా అని అంటాడు శ్యామ్. పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు శ్యామ్ పండు ప్రాణాలను కాపాడుకోవాల్సిన టైం ఇది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను రుక్మిణి దగ్గరికి వెళ్తాను పండు పరిస్థితి లాగా ఉందని పాతిక లక్షలు ఇవ్వమని అడుగుతాను
అవసరమైతే తన కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడైనా సరే పాతిక లక్షలు తెచ్చి పండుకి ఆపరేషన్ చేయిస్తాను పండు కన్న నాకు ఏది ముఖ్యం కాదు అని ధనుంజయ్ వెళ్లి పోతుండగా రాధ ఆగండి అని అంటుంది. మీరన్నది నిజమే మామయ్య గారు పండు కన్న మనకు ఏది ముఖ్యం కాదు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకు పాతిక లక్షలు ఇవ్వగలిగింది మా అక్క ఒక్కతే మీరన్నట్టు తనను బ్రతిమిలాడి పాతిక లక్షలు తెచ్చి పండుని బ్రతికించుకోవాలి కానీ తన కాళ్లు పట్టుకోవాల్సింది బ్రతిమిలాడాల్సింది మీరు కాదు మామయ్య గారు నేను నా బిడ్డను బ్రతికించుకోవడం కోసం మా అక్క కాళ్లు పట్టుకోవాల్సింది నేను నేనే వెళ్లి డబ్బులు తెస్తాను మీరు ఇక్కడ ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయండి అని రాధ అంటుంది.
రాధ ఆలోచించుకొని ఆ ఇంటికి వెళ్ళు అవసరమని నువ్వు ఆవిడని డబ్బులు అడిగితే నిన్ను అవమానించి పంపిస్తుంది అని శ్యామ్ అంటాడు. నాకు నా పరువు కన్నా నా పండే ముఖ్యం అని అంటుంది రాధ. అయితే నేను కూడా వస్తాను పద అని శ్యామ్ అంటాడు. మీరు వస్తే మా అక్క పద్ధతి వేరే లాగా ఉంటుంది మీరు రాకండి నేను వెళ్తాను అని వెళ్లబోతుంది రాధ. రాధ నువ్వెళ్ళకు రుక్మిణి దగ్గరికి వెళ్లాల్సింది నేను మనం ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం నేను అని అంటాడు శ్యామ్. అయితే మీరు వెళ్లే సమయం ఇది కాదు రేపు పొద్దున వెళ్లండి అని అంటుంది రాధ.
శ్యామ్ రుక్మిణి దగ్గరికి వెళ్లి తలుపు కొడతాడు. దాక్షాయిని చలపతి డోర్ తీస్తారు. ఏమైనా తాగి వచ్చావా అల్లుడు అని అడుగుతుంది దాక్షాయిని. తాగిన మత్తులో రాలేదు తాగి రాలేదు రుక్మిణి కోసం వచ్చాను అని అంటాడు శ్యామ్. నైట్ లేటుగా పడుకుంది పొద్దున లేటుగా లేస్తుంది ఎవరు వచ్చినా లేపొద్దు అని చెప్పింది బాబు అని అంటుంది దాక్షాయిని. శ్యామ్ వెళ్లి రుక్మిణి డోర్ కొడతాడు. ఏంటి ఇంత పొద్దున వచ్చావు అని అడుగుతుంది రుక్మిణి. పండు కి ఆపరేషన్ కి పాతిక లక్షలు కావాలి నువ్వే కదా ఏదో దిక్కు మన కూల్డ్రింక్ తాగించి వాడు ఈ పరిస్థితికి వచ్చేలా చేసావు అని అంటాడు శ్యామ్. పాతిక లక్షల కావాలంటే మీరు సంపాదించి ఆపరేషన్ చేయించండి నేను అమ్మని కాదు నన్ను ఒక్కసారి కూడా అమ్మ అని పిలవమంటే పిలవలేదు అని అంటుంది రుక్మిణి.
మమ్మల్ని మోసం చేసి మా డబ్బంతా తీసుకొని ఇప్పటికిప్పుడు పాతిక లక్షలు సంపాదించమంటే ఎలా మర్యాదగా డబ్బు ఇవ్వు అని అంటాడు శ్యామ్. ఊరికేనే ఏం వద్దు అప్పుగా ఇవ్వు నీకు వడ్డీ ఎంత కావాలంటే అంత పెట్టుకో నీ అప్పు త్వరగా తీర్చేస్తాను అని అంటాడు శ్యామ్. నేను ఇవ్వను అని అంటుంది రుక్మిణి. పండు చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఇలా చేయకు అని చెప్తాడు శ్యామ్. తండ్రివి నువ్వు ఉన్నావు వాడిని నువ్వే బ్రతికించుకో అని అంటుంది రుక్మిణి. పాతిక లక్షలు తీసుకెళ్లి నా పండుని నేనే బ్రతికించుకుంటాను అని శ్యామ్ బీరువాలో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. చలపతి పోలీసులకు ఫోన్ చేస్తాడు. శ్యామ్ నగలు తాకట్టు పెట్టడానికి షాప్ కు వెళ్లి నాకు పాతిక లక్షలు కావాలి ఇవి తీసుకోండి మీకు నెల రోజుల్లో డబ్బు ఇస్తాను అని అంటాడు శ్యామ్.
నేను వీటికి ఐదు లక్షలు మాత్రమే ఇస్తాను ఎందుకంటే ఇవి కొట్టేసిన నగలు కాబట్టి అని ఆ షాప్ లో ఉన్న అతను అంటాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవి మా అమ్మ నగలు నేను దొంగను కాదు అని శ్యామ్ అంటాడు. ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. నువ్వు రుక్మిణి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసావని మాకు ఫోన్ వచ్చింది అని పోలీస్ అంటాడు. నేను నిజంగా దొంగని కాదు సార్ ఇది మా అమ్మ నగలు అని శ్యామ్ చెప్పిన వినకుండా పోలీసులు తనని తీసుకొని వెళ్తారు. పోలీసులు షామిలి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. సార్ మా బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆపరేషన్ చేయకపోతే వాడు మాకు దక్కడు అందుకే నగలు తాకట్టు పెట్టబోయాను నన్ను నమ్మండి అని అంటాడు శ్యామ్. దొంగతనం చేసిన ప్రతివాడు ఇలాంటి మాటలు చెప్తాడు కానీ నమ్మడానికి పిచ్చోడిని కాదు అని పోలీస్ అంటాడు.శ్యామ్ ని జైల్లో వేస్తారు. రుక్మిణి వచ్చి, నువ్వు జైల్లో నీ కొడుకు హాస్పటల్లో నువ్వు రోజుగా చెప్పకూడదు తినాల్సిందే అని రుక్మిణి అంటుంది.