Gigantic Ocean: శాస్త్రవేత్తలు నిరంతరం రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఎన్నో కొత్తకొత్త విషయాలను కనుగొంటూ ఉంటారు. ఒక్కో సారి శాస్త్రవేత్తలు ఒక అంశం గురించి రీసెర్చ్ చేస్తుంటే మరో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు భూమి కింద భారీ మహా సముద్రాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏడు మహా సముద్రాల కంటే అది చాలా పెద్దదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఏడు మహా సముద్రాల్లో ఉన్న నీటి పరిమాణం కంటే మూడు రెట్లు ఎక్కవు నీరుతో భూగర్భంలో మహా సముద్రం ఉందని గుర్తించారు. భూమి ఉపరితలానికి దాదాపు 700 కిలో మీటర్ల అడుగున ఈ భారీ మహా సముద్రం ఉందని అమెరికాలోని ఇలినాయిస్ స్టేట్ లో ఉన్న నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఆ మహాసముద్రానికి గిగాంటిక్ మహా సముద్రం అని పేరు పెట్టారు దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
భూగర్భంలోని రింగ్వుడైట్ అనే రకానికి చెందిన శిలాతలం లోపల భారీగా నీరు ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ‘డీహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ మ్యాంటిల్’ అనే పేరుతో విడుదల చేసిన రీసెర్చ్ రిపోర్టులో ప్రస్తావించారు. రింగ్వుడైట్ శిలల కు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను ఇందులో వివరించారు.
రిసెర్చ్ రిపోర్టు ప్రకారం.. భూకంపాలను కొలిచే సీస్కోమీటర్లు భూమి అడుగున షాక్ వేవ్స్ ను గుర్తించడంతో భూమి అడుగున కూడా నీటి జాడ ఉందని సైంటిస్ట్ లు తెలుసుకోగలిగారు. భూమి లోపల క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనే మూడు పొరలు ఉంటాయి. భూమి మ్యాంటిల్ జోన్ లోని ఖనిజాల్లో భారీ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం ఉందంటే దాని అర్ధం భారీ నీటి జలాశయమే అనే నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చారు.
రింగ్వుడైట్ రాయి ఒక స్పాంజిలా ఉంటుంది. ఇది నీటిని పీల్చుకొని నిల్వ చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రాయి హైడ్రోజన్ ను ఆకర్షించడం ద్వారా నీటిని నిల్వ ఉంచుకుంటోందని పరిశోధన బృందంలో ముఖ్య పాత్ర వహించిన జియోఫిసిస్ట్ స్టీవ్ జాకబ్ సన్ వెల్లడించారు. భూమి పొరల్లో దాగి ఉన్న ఈ నీటి జాడ కోసం సైంటిస్ట్ లు గత కొన్ని దశాబ్దాలుగా వెతుకున్నారని ఆయన తెలిపారు.
YS Jagan: కేబినెట్ లో ఆ అభ్యర్ధికి బెర్త్ కన్ఫర్మ్ చేసిన సీఎం జగన్