Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: నాకు తెలియకుండా ఎలా ఆశీర్వదించేసాను అని అమరేంద్ర షాక్ అయిపోతాడు. ఎంత పెద్ద ఇల్లు రేపటి నుంచి ఇక్కడే ఉంటామా అని మంగళ అంటుంది. ఇక్కడ ఎందుకు ఉంటాం బయట ఉంటాం అని భాగమతి అంటుంది.ఇంత పెద్ద ఇల్లు ఉండగా బయట ఉండడమేంటి మిస్సమ్మ అని శివరామ్ అంటాడు. బయట ఉంటే కంఫర్ట్ గా ఉంటుంది అంకుల్ అని మిస్సమ్మ అంటుంది.మిస్సమ్మ బ్యాగు తీసుకుని లోపలికి వెళ్ళు అని నిర్మల చెబుతుంది. తప్పదంటారా అని భాగమతి అంటుంది. మీకు నచ్చిన నచ్చకపోయినా మీరిద్దరూ కలిసి ఒకే గదిలో ఉండాలి అని శివరామ్ అంటాడు.పదవే ఇంకా ఏమి ఆలోచిస్తున్నావ్ అని కరుణ అంటుంది.
కట్ చేస్తే, మనోహరి బ్యాగు తీసుకుని బయటికి వెళ్తూ ఉంటుంది. ఆగండి అమ్మగారు అని నీలా తన వెనకాల వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ మనోహరి అని అమరేంద్ర అంటాడు. నేను అనాధని అమర్ ఇక్కడ ఉండి ఏం చేయమంటావ్ నేను అనాధ గానే మిగిలిపోయాను నీతో పెళ్లి కాలేదు ఇంటికి నాకు సంబంధం ఏంటి అందుకే వెళ్ళిపోతున్నాను అని మనోహరి అంటుంది.ఇంతకుముందు ఆరు కుటుంబ నా కుటుంబమే అన్నావ్ ఇప్పుడేమైంది వెళ్ళిపోతున్నావ్ అని అమరేంద్ర అంటాడు. మొన్నటిదాకా నీకు నాకు పెళ్లి అవుతుంది అనుకున్నాను నీతో పెళ్లి జరగలేదు ఇక్కడ ఉండి చేసేదేముంది అమర్ ఇక్కడ ఉంటే అంత మంచిగా ఉండదు వెళ్ళిపోక తప్పదు కదా అని మనోహరి అంటుంది.
మోసం చేసే వాళ్లే ఈ ఇంట్లో ఉంటున్నప్పుడు నీకు స్థానం లేదా మనోహరి నువ్వు ఆరు ఫ్రెండ్ వి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు నీ బాధ్యత నాది నువ్వు ఇక్కడే ఉండు అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ బ్యాగు తీసుకుని లోపలికి వెళ్ళు అని నిర్మల అంటుంది. ఎందుకు ఆంటీ ఇక్కడ ఉండి నేను చేసేదేముంది బయటికి వెళ్లిపోతాను అని మనోహరి అంటుంది. ఉండమన్నది అమరేంద్ర మాత్రమే ఇంట్లో నిన్ను ఎవరు ఉండమనలేదు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అని కరుణ అంటుంది. మిస్సమ్మ నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రా అని నిర్మల అంటుంది. పిల్లలతో మాట్లాడాక ఫ్రెష్ అప్ అవుతాను ఆంటీ అని భాగమతి అంటుంది. త్వరగా వెళ్లి రామ అని రామ్మూర్తి అంటాడు. భాగమతి పిల్లల దగ్గరికి వెళుతుంది. అమ్మ అమరేంద్రయ్య ఉండమన్నాడు కాబట్టి ఇక నీకు ఎదురు లేదమ్మా అని నీలా అంటుంది.
చూస్తూ ఉండే భాగమతి యుద్ధం మొదలుపెట్టింది ఆ యుద్ధాన్ని నేను ముగిస్తాను పెళ్లయిపోగానే అంతా అయిపోయింది అనుకుంటుంది అంత తేలిగ్గా అమర్ ని ఎలా వదిలేస్తానే అమర్ నాకు సొంతం ఆ బాగిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి అమర్ తో నేను జీవితాన్ని పంచుకుంటాను అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, భాగమతి పిల్లల దగ్గరికి వెళుతుంది. పిల్లలు తన వంక కోపంగా చూస్తారు. పిల్లలు ఎలా ఉన్నారు అసలేం జరిగిందో చెబుతాను అని భాగమతి అంటుంది. అమ్మో మన పర్మిషన్ లేకుండా మన గదిలోకి ఎవరు వస్తారు వాళ్లతో మాట్లాడటం మనకు ఇష్టం లేదు వెళ్లిపొమ్మని చెప్పు అని అంజలి అంటుంది. అంజు మన గదిలోకి వచ్చిన మనకు ఇష్టం లేకుండా ఎవరు మాట్లాడలేరు ఆ విషయం వాళ్ళకి తెలియదు అని అమృత అంటుంది. అర్థమైంది నా మీద మీకు కోపం ఉంది కానీ ఏం జరిగిందో చెబుతాను అని భాగమతి అంటుంది. అంజలి ఆ మాటలు వినపడకుండా పాటలు పెడుతుంది. అమ్ము పాటలు పెట్టుకున్నాక ఎవరి మాటలు వినపడట్లేదు ప్రశాంతంగా ఉంది అని అంజలి అంటుంది.
భాగమతి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మిస్సమ్మ నువ్వు ఏం చెప్పినా నీ ఎనర్జీ వేస్ట్ మేము ఏమి వినదల్చుకోలేదు ఇకనుంచి వెళ్ళిపో అని ఆకాష్ అంటాడు. అంజలి పాప నామీద నీకు ఎంత కోపం ఉన్నా నేను చెప్పేది నువ్వు వినే దానివి నువ్వైనా ఏం జరిగిందో చెప్తాను విను అని భాగమతి అంటుంది.ఇంకా ఏం చెప్పి మమ్మల్ని మోసం చేస్తావు మా గదిలో నుంచి బయటికి వెళ్లిపో అని అంజలి భాగమతిని బయటికి నెట్టేసి డోర్ పెట్టుకుంటుంది.పిల్లలకు నా మీద చాలా కోపం వచ్చేసింది ఏం చేయాలి అని ఆలోచిస్తుంది భాగమతి. కట్ చేస్తే, గుప్తా గారుమీ లోకానికి పోదామంటే వినడం లేదు రండి వెళ్దాము అని అరుంధతి అంటుంది.
ఇక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకోకుండా ఎలా వెళదాము బాలిక అని గుప్తా అంటాడు.గుప్తా గారు మీరు ఇలాగే చేస్తే మీ యములోకానికి వెళ్లినప్పుడు మీ యమధర్మరాజు తో చెప్పి మీ యమలోకంలో ఉన్న శిక్షలను వేయిస్తాను అని అరుంధతి అంటుంది. ఈరోజు నీ పతి దేవునికి ఆ మిస్సమ్మ కి తొలిరేయి జరుగుచున్నది అది వీక్షించవా బాలిక అని గుప్తా అంటాడు.గుప్తా గారు మీరు ఇంకేమీ నాకు చెప్పొద్దు అని అరుంధతి చెవులు మూసుకుంటుంది. అయినా వినిపించుకోకుండా గుప్తా తన వెంట పడి పడి చెప్తూ ఉంటాడు. అరుంధతి అక్కడి నుంచి పారిపోతుంది. గుప్తా గారు పాట పాడుకుంటూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది