Mamagaru April 30 2024 Episode 351: డైరెక్ట్ గా వాళ్ళిద్దర్నీ పట్టుకొని కడిగేస్తాను శామ్ జోలికి రా వద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తాను అని రుక్మిణి అనుకుంటుంది. శ్యామ్ గుడిలోకి వెళ్లి కిరణ్ కలుస్తాడు. రుక్మిణి శ్యామ్ ని ఫాలో అవుతూ అదే గుడిలోకి వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. ఏంట్రా అర్జెంటుగా రమ్మని రుక్మిణి గురించి మాట్లాడాలన్నావ్ ఏంటి అని కిరణ్ అడుగుతాడు. ఇన్ని రోజులు రుక్మిణి స్వార్థంతో ప్రవర్తిస్తుంది మోసం చేసింది తనే స్వార్థపరురాలు అనుకున్నాను రా కానీ స్వార్థపరురాలు ఎవరో అర్థమైంది రాధా స్వార్థంగా ఆలోచించడం వల్లనే కదరా రుక్మిణి అలా మొండిగా తయారయింది అని శ్యామ్ అంటాడు. ఏంట్రా రుక్మిణి గురించి మాట్లాడాలంటే ఏదో అనుకున్నాను
రుక్మిణి మీద ప్రేమ చూపిస్తున్నావ్ ఏంటి రాదని ద్వేషిస్తున్నావ్ అని కిరణ్ అంటాడు. అవున్రా రుక్మిణి నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకున్నాను పండు ని నన్ను సొంతం చేసుకోవడానికి ఎంతగా తపన పడుతుందో ఆలోచించాను అందుకేరా రుక్మిణి తో కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నాను అని శ్యామ్అంటాడు. ఏంటి నీకు జ్ఞానోదయం కలిగిందా అని కిరణ్ అంటాడు. అవున్రా జ్ఞానోదయం కలిగింది నిన్న రుక్మిణి ని కాపాడిన తర్వాతే రుక్మిణి మీద నాకు ప్రేమ ఉందని అర్థమైంది ఎంతైనా భార్య కదరా అందుకే తన మీద నాకు ప్రేమ ఉందని అర్థమైంది నన్ను పండు నీ సొంతం చేసుకోవాలని ఎంత అరాటపడిందో అర్థమైంది
ఎంతైనా రుక్మిణి చాలా మంచిది రా నేనే అర్థం చేసుకోలేదు రాదా స్వార్థపరురాలు స్వార్థంగా ఆలోచించింది కాబట్టే తను ఒంటరిగా మిగిలిపోయింది అని శ్యామ్ అంటాడు. అంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది శ్యామ్ అని కిరణ్ అంటాడు. రాధా స్వార్థపరురాలు కాకపోతే వాళ్ళ అక్క భర్తని తెలిసిన తర్వాత అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదరా నేను తన భర్తగా ఉండాలి అనుకుంది పండు తన కొడుకుగా ఉండాలని స్వార్ధంగా ఆలోచించింది కాబట్టే రుక్మిణి నన్ను సొంతం చేసుకుంది తన బిడ్డను సొంతం చేసుకుంది తర్వాత వాళ్ళ అత్తమామల్ని కూడా సొంతం చేసుకుంటుంది తన భర్తని తన సొంతం చేసుకోవాలని ఆలోచించింది కాబట్టి రాదని మాత్రం ఒంటరిగా
వదిలేస్తుంది అని శ్యామ్ అంటాడు. ఆ మాటలన్నీ విన్న రాదా గుండెలు పగిలేలా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న రుక్మిణి సంతోషంతో శ్యామ్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడానేనే అర్థం చేసుకోలేకపోయాను అని రుక్మిణి వెళ్ళిపోతుంది.ఇక ఆపరా నీ నటన రుక్మిణి వెళ్ళిపోయింది అని కిరణ్ అంటాడు.నేను రుక్మిణీ నీ ప్రేమిస్తున్నానని తెలిసింది కాబట్టి రాధ జోలికి వెళ్లదు రాజ సేఫ్ గా ఉంటుందిరా అని శ్యామ్ సంతోషిస్తాడు.కట్ చేస్తే,పండు స్కూల్ కి రెడీ అవుతాడు. పండు స్కూలుకు పదా అని దాక్షాయని అంటుంది. మా మమ్మీ వచ్చేదాకా నేను స్కూలుకు వెళ్ళను అని పండు అంటాడు. మీ మమ్మీ ఇక్కడికి రాదు కదరా అని దాక్షాయని అంటుంది. ఇంతలో రుక్మిణి అక్కడికి వస్తుంది.
రుక్మిణి ని చూసి అదిగో మా మమ్మీ వచ్చేసింది అని పండు అంటాడు. పండు నువ్వు నన్ను మమ్మీ అన్నావా అని రుక్మిణి అంటుంది. అవును మమ్మీ డాడీ నిన్న నాకు చెప్పాడు నువ్వే మా మమ్మీ ని రాధమ్మ అమ్మ కాదని చెప్పాడు అందుకే నిన్నే అమ్మని పిలుస్తాను అని పండుఅంటాడు.నువ్వు అమ్మ ని పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది పండు నీకేం కావాలో చెప్పు అని రుక్మిణి అంటుంది. నాకు స్కూలుకు టైం అవుతుంది వెళ్తానమ్మ అని పండు అంటాడు.పిన్ని పండు కి టిఫిన్ పెట్టి స్కూల్ దగ్గర వదిలిపెట్టి రా మాకు టిఫిన్ పెట్టు అని రుక్మిణి అంటుంది.శ్యామ్ రుక్మిణి టిఫిన్ చేస్తూ ఉంటారు.
ఏంటి రుక్మిణి అలా చూస్తున్నావ్ అని శ్యామ్ అంటాడు. ఏమీ లేదు నీలో ఇంత మార్పు ఎలా వచ్చిందో ఆలోచిస్తున్నాను అని రుక్మిణి అంటుంది. ఏముంది ఆ రాధ ఎలాంటిదో తెలుసుకున్నాను అందుకే నువ్వంటే నాకిష్టం రుక్మిణి ఐ లవ్ యు అని శ్యామ్ అంటాడు. ఐ లవ్ యు టూ శ్యామ్ నామీద నీకు ఇంత ప్రేమ ఉందని తెలియదు అని రుక్మిణి శ్యామ్ కి ప్రేమగా టిఫిన్ తినిపిస్తుంది. శ్యామ్ మనం హనీమూన్ ట్రిప్ కి వెళ్దామా అని రుక్మిణి అంటుంది. నీ ఇష్టం రుక్మిణి అని శ్యామ్ అంటాడు. అయితే మనం వెళ్లడానికి ఈరోజు బట్టలు షాపింగ్ చేద్దాం అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది