అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పార్టీని రాష్ట్రంలో ఘోరంగా ఓడించినా, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినా వారిలో ఏ మార్పు రాలేదన్నారు. చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశంలో ఉపన్యాసాలు ఇచ్చి ఏదో జరిగిపోతుందని చెప్పి అసత్య ఆరోపణలతో జగన్ ప్రభత్వంపై బురదచల్లేప్రయత్నం చేస్తున్నారని అంబటి విమర్శించారు. కేవలం నాలుగు తాత్కాలిక భవనాలు కట్టి బ్రహ్మాండమైన రాజధాని కటుతున్నానని చంద్రబాబు ప్రజలను మభ్యపుచ్చారని అన్నారు.చివరకు ఆరోగ్యశ్రీ పధకంపై కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి చెందిన పేద ప్రజల కోసం పక్క రాష్ట్రాలలో కూడా ఆరోగ్యశ్రీ అమలు చేస్తుంటే దానిపైనా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాలలోని ఆస్పత్రులకు వర్తింప చేస్తే మన ఆదాయం పోతుందని చంద్రబాబు అనడం హస్యాస్పదంగా ఉందన్నారు.
పవన్ కల్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడులా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ సార్దక నామధేయుడని అన్నారు. మొదటి మాట పవనం, చివరి మాట కల్యాణంకు ఆయన ఎప్పుడో న్యాయం చేశాడని అంబటి వ్యంగంగా వ్యాఖ్యానించారు. జగన్ను పవన్ సిఎంగా గుర్తించకపోతే వచ్చిన నష్టం ఏమీలేదని అన్నారు.మొన్నటి ఎన్నికల్లో పవన్, బిజెపి, తెలుగుదేశం కలిసి పోటీ చేసినా వైసిపి కట్టకట్టి సముద్రంలో పడేసేదని అంబటి పేర్కొన్నారు. రాజదానిలో నడుస్తాను, నడుస్తాను అంటున్నారు ఆయన నడిస్తే ఎమవుతుందని అన్నారు.
పవన్ మాటలు ఎవరికి అర్థం కావడం లేదని అంబటి పేర్కొన్నారు. ‘క్రిస్టియానిటిలో చాలా గొప్పదనం ఉందంటాడు. క్రిస్టియన్ స్కూల్లో తాను చదువుకున్నానంటాడు. భార్య, పిల్లలు క్రిస్టియన్స్ అంటాడు. క్రిస్టియన్స్ చేసే మానవసేవ ఏమతం చేయలేదంటాడు.తిరిగి మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నారని వైసిపిని అంటారు. హిందూమతం చాలా గొప్పది అంటారు. ఏంటి ఈ కాంట్రావర్సియల్ వ్యాఖ్యలు మాకు అర్దం కావడం లేదు’ అని అంబటి వ్యాఖ్యానించారు.సెక్యులర్ దేశం అయిన భారత్లో అన్ని కులాలు, మతాలు సహజీవనం చేస్తుండగా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమని అయన అన్నారు.
పవన్ కల్యాణ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని అంబటి అన్నారు. చంచల మనస్ధత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి వ్యాఖ్యానించారు. ఆయనకు ఏ విషయంపైనా స్దిరత్వం లేదని అన్నారు.
Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More
OTT: ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More
Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More
Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More
Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More
JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More
Anasuya Bharadwaj: స్టార్ యాంకర్, నటి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెలబ్రేట్… Read More
Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జరిగింది.… Read More