BJP: తెలంగాణలో పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలోపేతం అవుతోంది. బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి కేసిఆర్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత సాగర్ ఉప ఎన్నిక మినహా ఇతర ఎన్నికల్లో బీజేపీ హవా చాటుతూ వస్తోంది. తొలుత దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 4 స్థానాల నుండి 40కిపైగా స్థానాలకు ఎగబాకడం, ఆ తరువాత ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు. తాజాగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో జరుగుతోంది. ఈ తరుణంలో టీఆర్ఎస్ సర్కార్ కేంద్రంపైనా తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇదే అంశంపై వారం రోజుల పాటు పార్లమెంట్ లో నిరసనలు వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు నిన్న సమావేశాలను బహిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో రైతుల ముందు కేంద్రాన్ని దోషిగా చూపాలని టీఆర్ఎస్, టీఆర్ఎస్ సర్కార్ నే దోషి గా చూపాలని బీజేపి ప్రయత్నం చేస్తోంది.
ఈ తరుణంలో రాష్ట్రంలోని కీలక అంశాలపై చర్చించేందుకు ఏపి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజలు క్రితం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ను కోరారు. బండి సంజయ్ అపాయింట్మెంట్ అమిత్ షా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అమిత్ షా కార్యాలయం నుండి బండి సంజయ్ కు సమాచారం వచ్చినట్లు సమాచారం. గురువారం (రేపు) ఉదయం అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కు అమిత్ షా కార్యాలయం నుండి ఫోన్ చేసి చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో సహా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, నలుగురు ఎంపీలు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రేపు అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్ర రాజకీయాలు, రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రతో పాటు ప్రధానంగా ధాన్యం కొనుగోలు సమస్యపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on December 8, 2021 12:29 pm
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More
Krishna Mukunda Murari May 17 2024 Episode 472: భవానీ దేవి పంతులు గారిని పిలిచి ముకుందా ఆదర్శ… Read More
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More
AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More
CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More
Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More