Chandrababu Arrest: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపిక, ప్రచార పర్వంలో ముందంజలో ఉన్నాయి. జనసేన పార్టీ కూడా పోటీకి సిద్దమయ్యింది. జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండటంతో బీజేపీ నేతలు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. దాదాపు 32 స్థానాల్లో పోటీ చేయాలని తొలుత జనసేన భావించినా పొత్తులో భాగంగా అయితే 20 స్థానాలు అడుగుతున్నట్లు తెలుస్తొంది. పది నుండి 12 స్థానాలు కేటాయించడానికి బీజేపీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఇరు పార్టీల నేతల మధ్య మరో సారి చర్చలు జరిగితే ఏదో ఓ విధంగా అవగాహన కుదిరే అవకాశం ఉంది.
టీడీపీ మాత్రం ఇంత వరకూ అభ్యర్ధుల ఎంపిక జరగలేదు. దీంతో ఈ సారి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం లేదనీ, బీజేపీకి మద్దతు ఇస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవలే 80కిపైగా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు ప్రకటించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబును తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిసి వచ్చారు. నందమూరి బాలకృష్ణ కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని చెప్పారు. ఆ తర్వాత ఆయన మళ్లీ సినిమా బిజీలో పడిపోయారు. మరల పార్టీ ఆఫీసుకు వచ్చిన దాఖలాలు లేవు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు పడలేదు.
ఏపీలో జనసేన – టీడీపీ పొత్తులో ఉన్నా తెలంగాణలో ఈ పొత్తును కొనసాగించే ఆలోచనలో రెండు పార్టీలు లేవు. బీజేపీతో కలిసి జనసేన పయనిస్తొంది. ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తులో ఉండటంతో తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా కాస్తోకూస్తో టీడీపీ బలంగా ఉన్న స్థానాలనే జనసేనకు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీలో జనసేనతో పొత్తు ఉండటంతో చంద్రబాబు ఆ స్థానాల్లో అభ్యర్ధులను పోటీకి దింపే అవకాశం ఉండదు.
తెలంగాణలో టీడీపీ పోటీ చేయదని జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత ఒకరు ఖండించారు. పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీనిపై స్పందించలేదు కానీ టీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఇంతకు ముందే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికే ఆశావహుల నుండి అప్లికేషన్ లు తీసుకున్నామన్నారు. త్వరలోనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల వివరాలను ప్రకటిస్తామన్నారు.
తమ అధినాయకుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలులో ఉంచారన్నారు. ములాఖత్ లో ఆయనను కలిసిన తర్వాత అభ్యర్దుల విషయంపై స్పష్టత ఇస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ బలపడితే తాము ఎక్కడ దెబ్బతింటామోనని భయపడి కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీపై వదంతులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేరుగా ప్రకటన చేయకపోవడంతో అనుమానాలు కొనసాగుతున్నాయి. బీజేపీ పొత్తుతో జనసేన పోటీ చేసే స్థానాలు వెల్లడైన తర్వాతనే టీడీపీ నుండి పోటీ చేసే అభ్యర్ధులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అటు పార్టీ అధినేత చంద్రబాబు జైల్ లో ఉండటం, బీజేపీతో తలపడే పరిస్థితిలో లేకపోవడంతో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక బేషరతుగా జనసేన, బీజేపీకి మద్దతు ఇస్తుందా అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
This post was last modified on October 25, 2023 2:50 am
May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More
Chandu: త్రినయని సీరియల్ లో నటించిన చందు మన అందరికీ సుపరిచితమే. ప్రజెంట్ చందు రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం బంటి… Read More
Big Boss: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా బిగ్ బాస్ అంటే… Read More
Trinayani: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు… Read More
Bigg Boss Ashwini: అనేకమంది నటీనటులు బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందుతున్నారు. గతంలో వారు ఎవరో ప్రేక్షకులకు… Read More
Anchor Varshini: చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాకి దగ్గరగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఉంటారు. మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ… Read More
Tollywood: ప్రస్తుతం ఉన్న సీరియల్ తారలు సినిమా తారలు కంటే ఎక్కువ హాట్ గా కనిపిస్తున్నారు. సినిమాలు ఏ రేంజ్… Read More
Manasu Mamatha: ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ మొత్తం వేడాకుల వ్యవహారాలతో వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు విడాకులు తీసుకుంటూ… Read More
Arvind Kejrival: లోక్ సభ ఎన్నికల తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుస ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నేతల అరెస్టు… Read More
ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ కుమార్… Read More
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని… Read More
Telangana EAPCET: తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్… Read More
SIT: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది.… Read More
EC: ఏపీలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు కలెక్టర్ తో పాటు మూడు జిల్లాల ఎస్పీలపై… Read More
Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More