Karthika Deepam 2 April 29th 2024: కారు డ్రైవ్ చేయలేనప్పుడు నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా అని కార్తీక్ అంటాడు. ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయావు కదా. నువ్వు అలా వెళ్ళిపోవడం నా ఫ్రెండ్స్ ముందు నాకు ఎంతో అవమానమో తెలుసా? నీ మీద కోపంతోనే నేను తాగానని జ్యోత్స్న చెబుతుంది. కోపంతో మనుషులను చంపేస్తావా అంటాడు. నీకు ప్రేమ విలువ తెలుసా అంటే నీకు ప్రాణం విలువ తెలుసా అని కార్తీక్ తిడతాడు. ఒక మనిషి ప్రాణం పోతే ఆ కుటుంబం అనాధ అవుతుంది. డబ్బులతో కూడా మనం చేసిన తప్పు సరిదిద్దుకోలేము. ఆ బాధ మన నీడ లాంటిది దానితో మనం ప్రయాణం చేయడం నరకం లాగా ఉంటుంది. నీకు ముందే చెప్పాను కాల్ వస్తే వెళ్ళిపోతానని అంటే రేపు పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా అని జ్యోత్స్న అంటుంది. నీకు పార్టీలు అంటే ఇష్టం లేదా నేనంటే ఇష్టం లేదా? నేను చిన్నప్పటి నుంచి బావ అనుకున్న భర్త అనుకున్న అది నిన్నే. అంత ప్రేమ నేను నీ నుంచి కోరుకుంటున్నాను కదా. మరి నేను కోరుకుంటున్న ప్రేమ నువ్వు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తుంది.
నువ్వు నాకు మరదలవే నాకు ఎలాంటి ఆశలు లేవని చెప్పేస్తాను అని తనలో తానే ఆలోచించుకుంటాడు కార్తీక్. ఇక కార్తీక్ విషయం చెప్పబోతుంటే దీప గదిలోకి వస్తుంది. జ్యోత్స్న, దీప మొహం కూడా చూడదు. నేను అలా నిజం చెప్పకుండా ఉండాల్సిందని దీప మాట్లాడుతుంటే జ్యోత్స్న కోపంగా చూస్తుంది. దీప తీసుకొచ్చిన పాల గ్లాస్ ని జ్యోత్స్న కోపంగా విసిరి కొడుతుంది. అది దీపం ముందు పడుతుంది. ఇక దీపా ది క్లీన్ చేస్తుంటే కార్తీక్ వద్దని అంటాడు. మీరు జాలి చూపిస్తున్నారు అది నాకు అవసరం లేదని అంటుంది దీప. మీరు నిజం చెప్పడం తప్పు కాదు కానీ అది జ్యోత్స్న అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అని కార్తీక్ చెబుతాడు. ఇక దీప రాకపోతే అసలు నిజం జ్యోత్స్న కి చెప్పేసే వాడిని అని అనుకుంటాడు. డే పని ఇంట్లో నుంచి తరిమేయడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదని పారిజాతం అనుకుంటుంది. కార్తీక్ కోపంగా పారు దగ్గరకు వచ్చి అరుస్తాడు. తప్పు చేసిన దాన్ని మందలించకుండా జ్యోత్స్న నీ ఎందుకు వెనకేసుకొస్తున్నావ్ అని అంటాడు.
జ్యోత్స్న నాకు మరదలు మాత్రమే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నువ్వు వెళ్లి అందరితో చెప్పావా లేదంటే నన్ను అందరితో చెప్పేయమంటావా అని అంటాడు. ఇంటి పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు ఏంటని పారిజాతం అంటుంది. పార్టీలో నేను వదిలేసి వచ్చానని తాగానని అంటుంది. నా వల్లే అలా జరిగిందని కూడా చెబుతుంది. నాకు ఈ ఫీలింగ్ చాలా గిల్టీగా ఉంది. ఈ ఫీలింగ్ పోవాలంటే అందరికీ నిజం చెప్పాలి. నువ్వు చెప్పవు చెప్పలేవని తెలుసు అందుకే అందరితో నేనే చెప్పాలని నీకు చెప్పడానికి వచ్చాను వినాలని అనుకుంటే రా అంటాడు కార్తీక్. నీ మరదలిని నువ్వే చంపాలని అనుకుంటున్నావా అని పారు గట్టిగా అరుస్తుంది. నువ్వు పార్టీలో లేవని మందు తాగింది.. జీవితంలో లేవని తెలిస్తే విషం తాగుతుంది. అది ఎంత మొండిదో నీకు తెలుసు. నువ్వంటే ఎంత ప్రేమ అనేది కూడా తెలుసు. అది అసలే బాధలో ఉంది. ఈ టైంలో అది తెలిస్తే ఇంకా బాధపడుతుంది. జ్యోత్స్న బలం, బలహీనత రెండు నువ్వే.
ఈ ఇంటికి ఉన్న ఏకైక మనవరాలు. అందరం దాని మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం అని సెంటిమెంట్ డైలాగులు కొడుతుంది పారు. పారు మాటలు విని కార్తీక్ కూడా కరిగిపోతాడు. వీలైనంత త్వరగా నిజం చెప్పమని చెబుతాడు. పెళ్లి చేసుకోనని అన్నాను కానీ తనంటే ఇష్టం లేదని కాదు. తన జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను అనేసి వెళ్ళిపోతాడు కార్తీ. దాని జీవితం బాగుండాలంటే దాని జీవితంలో నువ్వు ఉండాలని పారు అనుకుంటుంది. జ్యోత్స్న మంచిది కానీ మొండిది ఒక్కనొక కూతురు. పైగా ఆడపిల్ల అని అందరికీ గారాబం. జ్యోత్స్న చిన్నపాటి అవమానాన్ని కూడా తట్టుకోలేదు. అనుకున్నది దక్కకపోతే సహించలేదు. దానికి ప్రేమ కలిగితే అవతలి వాళ్ళు ఇవ్వకపోయినా చనువు తీసుకుంటుంది. దాని మనసు విరిగితే దూరం పెడుతుంది. మొహం మీదే మాట్లాడుతుంది. జ్యోత్స్న నీ మేము చిన్న పిల్లల అనుకుంటాం. దాని మాటలు పట్టించుకోవద్దని సుమిత్ర దీపకు చెబుతుంది.
నేను చెప్పింది నిజమే కానీ దానివల్ల తనకి అవమానం జరిగింది. నేను తనని హార్ధం చేసుకున్నాను అందుకే క్షమించమని చెప్పాను. అని అంటుంది దీప. ఇక అనంతరం పారు జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. నువ్వు అమాయకురాలివి కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళని మంచివాళ్లు అనుకున్నావ్. అమ్మని కాపాడిందని ఆ తల్లి కూతుర్లకు ఏమి లోటు లేకుండా చూసుకున్నావు. కొంచెం అయినా విశ్వాసం ఉందా దానికి.. అది నీ పరువు తీసింది. అది నీ జోలికి వచ్చినందుకు దాన్ని ఏం చేయాలో చూడు అంటుంది. ఇందులో తన తప్పు ఏముంది తాగింది నేను కారు డ్రైవ్ చేసింది ఆక్సిడెంట్ చేసింది నేను. తను జస్ట్ నిజమే కదా చెప్పిందని జ్యోత్స్న అంటుంది.
జరిగిన దానికి హర్ట్ అయ్యి నేను తన సారీ అంగీకరించలేదు కానీ తను ఏమి తప్పు చేయలేదని వెనకేసుకు వస్తుంది. జ్యోత్స్న మనసు విరిచేయాలని పారు అనుకుంటే మొత్తం తిరగబడుతుంది. దీప నోరు విపకపోయి ఉంటే తప్పు చేసావని నిజం పోలీసులకు తెలిసేది కాదు. పోలీస్ స్టేషన్ కి వెళ్లే దానివి కూడా కాదు. దీప నోరు తెరవకపోతే మీరందరూ అవమానంతో తల దించుకుని వచ్చేవారు కూడా కాదు. మీ అమ్మ దగ్గర నీ పరువు పోయింది. ఇంతకుముందు నువ్వు బయటికి వెళ్తే మిస్ హైదరాబాద్ వచ్చింది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మందు తాగి మనుషులను చంపేది వచ్చిందని అంటున్నారు. పరువు మరియు ప్రాణం పోతే తిరిగి రావు. దీప నోరు విప్పక పోయి ఉంటే నీ పరువు పోయేది కాదు. అని జ్యోత్స్న కి అక్కయ్యడం మొదలు పెడుతుంది పారు. ఏక ఆ తరువాత కాంచన వాళ్ళు జ్యోత్స్న గురించి మాట్లాడుకుంటారు. దీప నిజం చెప్పకుండా ఉండాల్సిందని కాంచన కూడా ఉంటుంది. కానీ కార్తీక్ మాత్రం దీప తప్పు లేదని అంటాడు. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.
Nuvvu Nenu Prema May 20 Episode 628: విక్కీ పద్మావతి ఇద్దరు అరవింద ఇంటికి వెళ్లి అరవిందతో మాట్లాడుతూ… Read More
Krishna Mukunda Murari May 20 Episode 474: ముకుంద కనిపించట్లేదని ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉంటారు తను… Read More
May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More
Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More
YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More
Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More
Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More
OTT: ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More
Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More
Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More
Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More
JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More