Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఎన్డీఏతో జనసేన భాగస్వామ్య పక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ ఇంత వరకూ ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళుతున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన ఎన్డీఏ నుండి బయటకు వస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇవేళ జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. జనసేన ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమేనని చెప్పారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఒక కమిటీ పని చేస్తుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఆయన అనుభవం ఇందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.
2024 ఎన్నికల తర్వాత అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పారు. సమయం వచ్చినప్పుడు పవర్ షేరింగ్ పై మాట్లాడుకుందామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజు ఎవరో.. మంత్రి ఎవరో తేలుతుందన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర దశ, దిశ మారుస్తామని అన్నారు. కొందరు అధికారులు ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని సూచించారు. త్వరలో బీజేపీ ఆశీస్సులతో ఏర్పడబోయే టీడీపీ, జనసేన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపికి మంచి రోజులు వస్తాయన్నారు. రాష్ట్రానికి బలమైన భవిష్యత్తు ఇవ్వబోతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎంగా ఉంటే ఇష్టం వచ్చినట్లుగా చేస్తే కరెక్టు కాదని అన్నారు.
సీఎం అంటే ప్రజలకు ట్రస్టీ అని, మంత్రుల కంటే కాస్త ఎక్కువ అధికారాలు మాత్రమే ఉంటాయన్నారు. సీఎం జగన్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని, జనాగ్రహం చూస్తే తట్టుకోలేరని అన్నారు. సంక్షేమ పథకాలు జగన్ వచ్చి తర్వాతనే అమలు కావడం లేదనీ, ఎన్నో దశాబ్దాలుగా పాలకులు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నాని అన్నారు. రాష్ట్రంలో జగన్ రాజ్యాంగ విరుద్దంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎంతటి పోరాటానికైనా సిద్దమనీ, కానీ సంయమనం పాటిస్తున్నాననీ, అది చేతకానితనం అనుకోవద్దని అన్నారు. జనసేన అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజున ఏపీ దశ దిశ మారుతుందని హామీ ఇచ్చారు. జనసేన కేవలం అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంట్ కు కూడా వెళ్లాలని, అందుకోసం టీడీపీతో కలిసి పని చేద్దామని అన్నారు.
Prashant Kishor: ఓటర్లపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Brahmamudi May 24 Episode 418: కావ్య ఇంట్లో కి మాయ ని తీసుకురావడంతో ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. దుగ్గిరాల… Read More
May 24: Daily Horoscope in Telugu మే 24 – వైశాఖ మాసం – శుక్రవారం- రోజు వారి… Read More
IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై… Read More
మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలింగ్ కేంద్రంలో… Read More
AP High Court: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. అదే విధంగా పోటీ చేసిన… Read More
బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్తకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన… Read More
AP High Court: రీపోలింగ్ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేర్వేరుగా… Read More
Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో మరో ముగ్గురు నిందితులను… Read More
Prashant Kishor: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ… Read More
Pushpa 2: ఈ ఏడాది భారతీయ చలనచిత్ర రంగం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా "పుష్ప 2". ప్రస్తుతం ఈ సినిమాకి… Read More
Satyabhama Movie: వివాహం అయిన తర్వాత కూడా హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకటి.… Read More
Suryavamsam Child Artist: విక్టరీ వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో సూర్యవంశం ఒకటి. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ… Read More
Laya: నటి లయను తెలుగు సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయవాడలోని బ్రాహ్మిన్ కుటుంబంలో లయ… Read More
Double iSmart: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి… Read More
Rakul Preet Singh: ఒకప్పుడు సౌత్ లో ప్రధానంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు… Read More