YSRCP – TDP: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ప్రాతినిద్యం వహిస్తున్న పెనమలూరు ఇన్ చార్జిగా మంత్రి జోగి రమేష్ ను పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పార్టీ పెద్దలు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆయన పార్టీ మార్పునకు సిద్దమైనట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇవేళ సాయంత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఆయన కలవనున్నారని తెలుస్తొంది.
రీసెంట్ గా పార్ధసారధి తన అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించారు. తన నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు పోటీ చేసినా ఆదరిస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే తనను గుర్తించలేదని వ్యాఖ్యానించారు. ఇవేళ లోకేష్ తో జరిగే చర్చల అనంతరం టీడీపీలో చేరే అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
కాగా పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ పెద్దలు పార్థసారథి ని కోరగా, ఆయన అందుకు అంగీకరించలేదు. ఎంపీగా గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకుంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. దీంతో పార్థసారథి పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ తరుణంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో.. పార్థసారథి క్యాంప్ ఆఫీస్కు వెళ్లగా, సమన్వయకర్తలు అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లు మచిలీపట్నం వెళ్లేందుకు అంగీకరించాలని కోరారు. అయితే మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని, పెనమలూరు నుండే తాను పోటీ చేస్తానని పార్థసారథి పార్టీ పెద్దలకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తొంది. అయితే పెనమలూరు టికెట్ పై టీడీపీ హామీ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పెనమలూరు టీడీపీ ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే బొడె ప్రసాద్ ఉన్నారు.
దివంగత మాజీ ఎంపీ కొలుసు రెడ్డయ్య యాదవ్ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన కొలుసు పార్ధసారధి 2004లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉయ్యూరు నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009 లో పెనమలూరు నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 కు ముందు వైసీపీలో చేరారు పార్ధసారధి. 2014 లో వైసీపీ అభ్యర్ధిగా మచిలీపట్నం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత పెనమలూరు ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టిన పార్ధసారధి 2019 ఎన్నికల్లో మరో సారి గెలిచారు.
YS Jagan: వైఎస్ఆర్ సీపీలో బీసీ నేతలకు పెద్ద పీట
Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More
Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More
OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More
T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More
Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More
Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More
Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More
ఏపీ సీఎం జగన్పై ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్న ఒకప్పటి వైసీపీ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా… Read More