ఇది “రాజీ”కీయ జగన్మంత్రం…!

Published by
sharma somaraju

పొలిటికల్ మిర్రర్

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎవరైనా…, ఎటైనా వెళ్లొచ్చు, రావచ్చు. అలా, అలా తిరగేసి చక్కర్లు కొట్టొచ్చు. లేకపోతే రాజకీయ బండి నడవదు. పాపం ఇవి తెలుసుకోలేని జగన్ “నైతిక విలువలు” అని…, “మాట తప్పను, మడమ తిప్పను” అని…, పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై “అదే రోజున అనర్హత వేటు” వేసేయ్యాలని… చెప్పుకొచ్చారు. సీఎం కాకమునుపు ఏ మీటింగ్లో అయినా, ఏ వేధికపై అయినా, ఏ సందర్భంగా అయినా ఆ 23 మంది, ఆ 23 మంది అంటూ చెప్పేవారు. ఇప్పుడో…! ఆహా…, మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంట…? పార్టీ కండువా వేయకపోతే మాత్రం రహస్యంగా ఉండిపోతుందా ఏంటి..? ఎమ్మెల్యేల పార్టీ మార్పులపై నాడు అంతగా గోల చేసిన జగన్ నేడు అసలు ఇలా చేర్పులు విషయంలో “రాజీ”కీయం చేయడానికి కారణం ఏంటి? ఆయన వేస్తున్న జగన్మంత్రం ఏంటి? అనేది కాస్త తెలుసుకుందాం.

151 మంది ఉన్నారుగా… ఇంకా ఎందుకు??

నాడు చంద్రబాబు వెంట ఉన్న ఎమ్మెల్యేలు 106 మంది మాత్రమే. అంటే మ్యాజిక్ ఫిగర్ కి 18 మంది ఎక్కువ. అందుకే కాస్త ఆందోళన, ఆత్మన్యూనతా, అభద్రతా భావంతో నెమ్మదిగా 23 మందిని లాగేసారు. ఇది జగన్ కి విపరీతంగా కోపం తెప్పించింది. అందుకే తరచు వారిపై, బాబుపై, టీడీపీపై తెగ విమర్శలు చేసేవారు. మరి నేడు జగన్ వెంట 150 మంది ఉన్నారు. బోలెడు మంది. అసెంబ్లీలో ఏ బిల్లు అయినా, ఏ మాట అయినా ఈజీగా చెల్లుబాటు అవుతుంది. అయినా జగన్ టీడీపీ ఎమ్మెల్యేలపై కన్నేశారు. చకచకా లాగేస్తున్నారు. మొదట వల్లభనేని వంశీ, తర్వాత మద్దాలి గిరి, ఇప్పుడు కరణం బలరాం… ఇంకో ఆరుగురు రెడీగా ఉన్నారట. కాస్త మాట్లాడి సెట్ చేస్తే 12 మంది వచ్చేస్తారని వైసిపి వర్గాల టాక్. అంటే నెలో, రెండు నెలల్లోనో వీళ్ళు రావడం ఖాయమేనని తెలుస్తుంది. ఇక్కడే జగన్ “నాడు తాను మాట్లాడిన నైతిక విలువలు, పార్టీ మార్పు, సంతలో పశువులు” అనేవి మర్చిపోయారు. నాడు చంద్రబాబు చేర్చుకుంటే సంతలో పశువుల్ని కొన్నట్టు…!! నేడు జగన్ చేర్చుకుంటే మార్కెట్లో కూరగాయలు కొన్నట్టా…? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా పార్టీ కండువా వేయకుండా, కేవలం తమకు మద్దతు మాత్రమే ఇచ్చేలా స్కెచ్ ఒకటి వేసుకుని అమలు చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం ఈ చేరికల ప్రధాన లక్ష్యం “చంద్రబాబుని ఒంటరి చేయడం, టీడీపీని పతనం చేయడం”. జగన్ మనస్తత్వాన్ని బాగా ఎరిగిన వారు ఆయన పార్టీలో చేర్చుకోవడం పెద్దగా నమ్మట్లేదు. ఎన్నికలకు ముందు జగన్ని నమ్మి వస్తే మనసుతో నమ్మి వచ్చినట్టు… ప్రభుత్వం ఏర్పడ్డాక వస్తే… పనుల కోసం వచ్చినట్టు. అని బాగా తెలిసిన వాడు జగన్. అందుకే ఒకసారి చేరిన తర్వాత కనీసం మళ్ళీ మొహం కూడా చూసేందుకు ఇష్టపడని తత్వం అని సీఎం సన్నిహితులు చెప్తుంటారు.

బాబుపై నమ్మకం లేకేనా…!

ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ జరుగుతున్నారు. 23 మందిలో ముగ్గురు వెళ్లగా, 20 మంది మిగిలారు. మరో ఆరుగురు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీలో అంతర్గత వర్గాలకు కూడా తెలుసు. మరి చంద్రబాబు ఏం చేస్తున్నట్టు…? వారిని ఆపలేరా?? అంటే… ఆపలేరు. ఏమి చేయలేరు. చంద్రబాబు ప్రస్తుతం ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. వీడుతున్న ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పాలంటే “పార్టీకి భవిష్యత్ చూపించాలి”…! “తనకి ప్రత్యామ్నాయం చూపించాలి”..! “జగన్ తో, వైసీపీతో మొండిగా పోరాడాలంటే కనీసం కేంద్రం అండ చూపించాలి”…! “2024లో అధికారంలోకి వస్తామన్న నమ్మకం కలిగించాలి. ఆర్ధిక లక్ష్యాలు నెరవేర్చాలి”…! ఇవేమీ చంద్రబాబు ప్రస్తుతం చేసే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీకి బలం పెరుగుతుంది. పథకాల పేరిట జగన్ మంత్రం వేస్తున్నారు. పథకాల లబ్దిని రుచి చూస్తున్న జనం అభివృద్ధి ఉందా? ఆగిందా? అనేది పట్టించుకోవడం లేదు. అంటే ఒక రకంగా జగన్ ఒక చేతిలో తినిపిస్తున్న “బెల్లం ముక్క”ని తింటూ, ఆస్వాదిస్తున్నారే తప్ప రెండో చేతిలో భవిష్యత్తుని పెద్దగా ఆలోచించట్లేదు. అందుకే వైసీపీకి ఇప్పుడు వచ్చే కష్టం, నష్టం ఏమి లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బాబుకి టీడీపీలో ప్రత్యామ్నాయం తయారుకాలేదు. ఎవరూ పార్టీని నడిపే సమర్ధతలో లేరు. కేంద్రం పెద్దలతో పొసగడం లేదు. ఇలా అన్ని ప్రతికూలతల మధ్య కష్టంగా టీడీపీలో ఉండలేక కొందరు ఎమ్మెల్యేలు, మాజీలు జగన్నామ స్మరణ చేసుకుంటూ జగన్మంత్రం పఠిస్తున్నారు.

మరి 2024లో సర్దుబాట్లు ఎలా…?
వైసీపీలో చేరికలతో కిటకిటలాడుతోంది. నాడు చంద్రబాబు కూడా ఇలాగే చేసి ఎన్నికల సమయాన సీట్ల సర్దుబాటులో ఇబ్బంది పడ్డారు. అందుకే సీట్ల కేటాయింపులో తేడా కారణంగా కొన్ని స్థానాలు కోల్పోయారు. మరి ఇలాగే చేరికలు ఉంటే 2024 నాటికి వైసిపి పరిస్థితి ఇంతేనా?? అని ప్రశ్నలు వస్తున్నాయి.
ఉదాహరణకు నిన్న పార్టీలో చేరిన కరణం బలరాం చీరాల ఎమ్మెల్యే. అక్కడ ఇది వరకే రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఇప్పటికీ బలంగా ఉన్నారు. ఆయనను కాదని, వచ్చే ఎన్నికల్లో కరణంకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అద్దంకి కేటాయించాలన్నా… ఇక్కడ టికెట్ పై వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ప్రస్తుత ఇంచార్జి బాచిన చెంచు గరటయ్య వేచి ఉన్నారు. ఇదే పరిస్థితి గుంటూరు పశ్చిమ, కనిగిరి, గన్నవరంలోనూ ఉంది. మరి నాలుగేళ్ళ తర్వాత కేటాయింపు కదా ఇప్పటి నుండే ఎందుకు ఆలోచన, కంగారు అంటే… రాజకీయం అంటే అంతే. అయిదేళ్ల లక్ష్యాలే ఇక్కడ ఇంపార్టెంట్. పార్టీలో ఇటీవల చేరిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తన అంతరంగీకులతో మాట్లాడుతూ…”2024లో టికెట్ హామీ తోనే వైసీపీలో చేరాను” అంటున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ పరిస్థితి ఏమైనట్టు. ఈయన కూడా కదిరి బాబూరావు చేరికపై అసలు పట్టించుకోవట్లేదు. ఆయనకు అంత సీన్ లేదు. వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అంటున్నారట. ఇలా ఇప్పటి నుండే అంతర్గత యుద్ధం మొదలయ్యింది.

శ్రీనివాస్ మానెం

This post was last modified on March 15, 2020 11:20 am

sharma somaraju

Recent Posts

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More

May 19, 2024

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More

May 19, 2024

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More

May 19, 2024

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More

May 19, 2024

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024