కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడి దాదాపు 8 నెలలు కావస్తోంది. ఈ సమయంలో పెద్ద పెద్ద చిత్రాలు సైతం ఓటిటి ప్లాట్ఫాం బాట పట్టాయి. అయితే మిగిలిన అందరికన్నా ముందే పరిస్థితిని అంచనా వేసి నడుచుకునే ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఈ సమయంలో కూడా షూటింగ్ లు ఆపని వర్మ ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు…
ఒక 20 ఏళ్ల కిందట రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే ఎంతో ఆతృతగా ఎదురు చూసిన జనానికి అప్పటినుండి ఒక పదేళ్ల తర్వాత అవే సినిమాలపై విరక్తి తెప్పించిన ఘనత వర్మ ది. భారత దేశంలోనే టాప్ దర్శకులలో ఒకటిగా పేరొందిన వర్మ చాలా కాలం నుండి నాసిరకం సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. గత మూడు నాలుగేళ్లలో అయితే ఇతని పరిస్థితి మరీ ఘోరం అయిపోయింది. ఒకప్పుడు వర్మ ఫ్లాప్ సినిమాల్లో కూడా క్వాలిటీ ఉండేది…. కానీ ఇప్పుడు కనీస విలువలు లేకుండా పోతున్నాయి. ఆఖరికి వర్మను విపరీతంగా అభిమానించే వారే అతనిని చాలా లైట్ తీసుకున్నారు. ఇక ఈ కరోనా సమయంలో అయితే అతని దూకుడుకి అడ్డు అనేదే లేకుండా పోయింది…
ఎవరికీ సాధ్యం కాని రీతిలో కరోనా టైం లో అరగంట, గంట నిడివితో బూతు సినిమాలు తీసి ఆన్లైన్లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసిన డబ్బులు బాగా సంపాదించాడు. ఇక ఆ సినిమాలను కూడా జనాలు నిదానంగా పట్టించుకోవడం మానేశారు. అయినా కానీ వర్మ వెనక్కి తగ్గలేదు. తన శిష్యులను పెట్టి సినిమాలు తీస్తూ తన పేరుమీద రిలీజ్ చేసుకుంటున్నాడు. డిసెంబర్ నెలలో అతనివి మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అవే కరోనా వైరస్, మర్డర్, దిశ ఎన్ కౌంటర్. వీటిలో మర్డర్, దిధ ఎన్కౌంటర్ విషయాలపై భారీ ఎత్తున వివాదాలు వచ్చాయి, కోర్టుకి కూడా వెళ్ళాయి. కానీ ఈ సినిమాలను రిలీజ్ చేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలో కరోనా వైరస్ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలోకి వదులుతాను అని వర్మ చెబుతున్నాడు. 18న మర్డర్, 25వ తేదీన దిశ ఎన్ కౌంటర్ రిలీజ్ అవుతాయి. ఇక వర్మ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు కానీ పట్టించుకునేవారే కరువయ్యారు. వర్మ సినిమాలకు జనాల్లో కనీస ఆసక్తి కూడా కనిపించడం లేదు. ఇక అతని ట్విట్టర్ అకౌంట్ లో తెగ ఊదరగొడుతున్నా స్పందించే వారే లేరు. అతి తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి సొమ్ము చేసుకుందాం అనుకుంటున్న వర్మ ప్లాన్ కు కనీసం పెట్టుబడి అయినా వస్తుందా అన్నది అనుమానమే. ఇక వర్మ ఏం మాయ చేసి జనాలు థియేటర్లకు రప్పిస్తాడో చూడాలి.
This post was last modified on December 3, 2020 2:35 am
Kalki2898AD: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి2898AD"కి సంబంధించి బుజ్జి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్… Read More
ఏపీలో ఈరోజు నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. నెట్ వర్క్ ఆసుపత్రులతో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో జరిపిన… Read More
MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంను ధ్వంసం చేసి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ… Read More
Chandrababu: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… Read More
OBC certificates cancelled: కలకత్తా హైకోర్టు మరో సంచలన తీర్పును వెలువరించింది. 2010 తర్వాత నుండి ప్రభుత్వం జారీ చేసిన… Read More
ఎన్నికల వేళ.. పోలింగ్ కేంద్రాల్లో అలజడి సృష్టించడం.. ఓటర్లను భయ భ్రాంతులకు గురిచేయడం.. ఓటింగ్ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడేలా చేయడం… Read More
Supreme Court: మనీలాండరింగ్ కు సంబంధించిన కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు సుప్రీం కోర్టులో… Read More
ఔను.. ఇప్పుడు ఎవరికి వారు.. తమ తమ ఓటు బ్యాంకుపై లెక్కలు వేసుకుంటున్నారు. మహిళలు, పురు షులు.. దివ్యాంగులు, వృద్ధులు,… Read More
వైసీపీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం శాసన సభ్యుడు పిన్నెల్లి రామకృష్నారెడ్డి అరాచ కాలు.. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.… Read More
Poll Violence: ఏపీలో పోలింగ్ రోజున మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఏడు ఘటనలు… Read More
Telugu Movie: ఫారెన్ కంట్రీస్ లో షూటింగ్ అనేది ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. మీడియం రేంజ్ హీరోల… Read More
Godavari: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన తీసిన అద్భుతమైన చిత్రాల్లో… Read More
Blink OTT: ఓటిటిలో ఇప్పుడు ఒక కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కి సంబంధించిన మూవీ వచ్చేసింది. కర్ణాటకలో బాక్స్… Read More
Maidaan OTT: అజయ్ దేవగన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం మైదాన్ సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.… Read More
OTT: రోజు రోజుకి ఓటిటీలా హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కి పెద్దగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు కాదు… Read More