Trinayani April 20 2024 Episode 1218: అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా అని సుమన అంటుంది.నైని వదిన గాయత్రి పెద్దమ్మ జాడ తెలుసుకోవాలని ఉసిరి దీపాలు పెడితే నువ్వు ఎందుకు వాటిని కిందపడేలా చేశావు అని విక్రాంత్ అంటాడు.అవి ఎక్కడ కింద పడ్డాయి గాల్లోనే ఉన్నాయి కదా అని సుమన అంటుంది.నీకు దేవుడిచ్చిన మాట సంగతి పక్కన పెడితే ఆ చిట్యాలమ్మ తల్లి ఆ ఉసిరి దీపాలను కింద పడకుండా గాల్లో ఆపింది అని విక్రాంత్ అంటాడు.నా భక్తి వలె అలా జరిగింది అని సుమన అంటుంది.మొహం మీద పసుపు కుంకుమ పెట్టుకోవు గని భక్తి అంటావేంటి నీకు భక్తి ఎక్కడుంది అని విక్రాంత్ సుమన ని కొట్టబోతాడు.
కొట్టకండి బుల్లి బావగారు చిట్యాలమ్మ తల్లి శాపం ఇవ్వగలదు అని సుమన అంటుంది. ఆ తల్లి వరం ఇవ్వకపోయినా నేను కోరుకుంటా నేను నువ్వు సుమంగళీగా పోవాలని అని విక్రాంత్ అంటాడు. నేను తొందరగా పోవాలని కోరుకుంటున్నారా బాబు గారు అని సుమన అంటుంది. నేను ముందు పోతే నీ మొహం మీద ఆ బొట్టు కూడా ఉండదు అని విక్రాంత్ అంటాడు. నా మొహం మీద బొట్టు లేకపోతే మొహం బాగోదు అని సుమన అంటుంది. అలంకారానికి మొగుడు కావాలి అంటున్నావు కానీ వదిన గుడికి వెళ్ళింది గాయత్రి పెద్దమ్మ జాడ తెలుసుకొని రాకపోతే అప్పుడు నీ అంత చూస్తాను అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,నైని రోడ్డు మీద నడుచుకుంటూ అమ్మవారి గుడికి బయలుదేరుతుంది.
ఇంతలో విశాలాక్షి ఒక గర్భిణీ స్త్రీలగా రూపం దాల్చి నైని కి ఎదురుగా వస్తుంది. తను దగ్గరికి వచ్చేసరికి నొప్పులు వచ్చినట్టు చేస్తుంది. అమ్మ ఇవాళ రేపు కాన్పు అయ్యేలా ఉన్నావ్ ఒక్కదానివిలా వచ్చావ్ ఏంటి ఎవరైనా తోడు తీసుకురావాల్సింది అని నైని అంటుంది. తీసుకొని మీ ఇంటికి రమ్మంటావా అమ్మ అని ఆవిడ అంటుంది. సర్లే నా సంగతి ఎందుకు కానీ గుడికి వెళుతున్నట్టున్నావ్ వెళ్ళు అని ఆవిడ అంటుంది. నేను గుడికి వెళుతున్నట్టు మీకెలా తెలుసు అని నైని అంటుంది. నువ్వు ఎన్ని పూజలు చేసిన నా మొగుడు లాగే నీ మొగుడు అన్ని విషయాలు నీతో పంచుకోడు అని ఆవిడ అంటుంది. విశాల్ బాబు అలాంటివారు కాదు ఆయన గురించి తప్పుగా మాట్లాడకు అని అంటుంది నైని . నీ బిడ్డ జడ తెలుసుకోవడానికి వెళుతున్నావు కదా అని ఆవిడ అంటుంది. ఆ విషయం నీకెలా తెలుసు అని నైని పరిగెత్తుకొచ్చి ఆవిడను అడుగుతూ ఉండగా నొప్పులు వచ్చినట్టు తల్లడిల్లిపోతుంది.
అయ్యో ఆ చెట్టు కిందకి వెళ్దాం పదమ్మ ఇక్కడ ఎండగా ఉంది అని అంటుంది నైని. ఎవరు చూడకుండా చీరలు మీ అత్తవి తెచ్చి అడ్డుకట్టు పైన ఎండ పడకుండా చూడు ఇక్కడే కాన్పు అవుతాను అని ఆవిడ అంటుంది. గాయత్రి అమ్మ గారి చీరల అని అంటూ ఉండగా ఆవిడ కింద పడిపోతుంది. విశాలాక్షమ్మ తల్లి ఈ అమ్మకి నువ్వే సహాయం చేయి అని నైని కళ్ళు మూసుకొని నమస్కారం పెట్టుకుంటుంది. వెంటనే గాయత్రి దేవి చీరలు వచ్చి ఆవిడ చుట్టూ చేరతాయి. నాగయ్య వచ్చి ఎండ కొట్టకుండా గొడుగు పడతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ చీరలు కట్టి ఉంటాయి నాగయ్య గొడుగు పట్టి ఉంటాడు నాగయ్య వచ్చావా ఈవిడకి సహాయం చేయడానికి అని అంటుంది నైని. కొద్దిగా ఓర్చుకో అమ్మ అని ఆవిడకి పురుడు పోస్తుంది నైని . అమ్మ నీకు పండు అంటి ఆడబిడ్డ పుట్టింది అని చెబుతోంది. తన చేతికి రక్తం అంటడంతో గాలిలో ఉన్న ఉసిరి దీపాలు కొండెక్కుతాయి. నీ బిడ్డ జడ తెలుసుకోవడం కోసం గుడికి వెళ్ళాలి అనుకున్నావు ఇక్కడే టైం అయిపోయింది మహిళా పడ్డావు కాబట్టి ఇటు నుంచి ఇంటికి వెళ్ళు అని ఆవిడ చెబుతుంది.
నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు మీకు మంచి జరిగింది మీరు బిడ్డని అన్నారు అని నైని అంటుంది. నేను చెప్పినట్టు చేస్తే నీ బిడ్డ జాడ నీకు తెలుస్తుంది అని ఆవిడ అంటుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ నైని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏంటి గారడీ పిల్ల ఉసిరి దీపాలు గాల్లోనే కొండెక్కాయి అని తిలోత్తమ అంటుంది. నైని అమ్మ దారిలో ఒక బిడ్డను కాపాడింది కాబట్టి ఉసిరి దీపాలు కొండేకాయ అని విశాలాక్షి అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని సుమన అంటుంది. వదిన నైని ఇంటికి వచ్చేసింది ఇప్పుడే బాల్కనీలో నుంచి చూశాను అని విశాల్ అంటాడు. గుడికి వెళ్లలేదా అని పావన మూర్తి అంటాడు. వెళ్లలేదు బాబాయ్ అని నైని అంటుంది. ఎందుకు వెళ్ళలేదు నైని అని విశాల్ అంటాడు. అమ్మ చేతికి ఉన్న రక్తం చూస్తే అర్థమవుతుంది అని విశాలాక్షి అంటుంది. తన చేతికి ఉన్న రక్తాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు.నేను గుడికి వెళుతూ ఉండగా ఒక గర్భిణీ స్త్రీ ఎదురయింది ఆవిడకి పురుడు పోసినప్పుడు అంటిన రక్తం తుడుచుకున్న అక్కడక్కడ మరకలు ఉండిపోయాయి అని నైని అంటుంది. అసలేం జరిగింది నైని అని విశాల్ అంటాడు.నైని జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆవిడ ఎవరో కానీ దైవాంశ సంభూతురాలు అందుకే అంత చక్కగా మాట్లాడింది అని హాసిని అంటుంది.
ఆవిడని ఇంటికి తీసుకు రావాల్సిందమ్మా అని విశాలాక్షి అంటుంది. నీ బిడ్డ జాడ తెలుసుకుందామని వెళ్లి ఒక బిడ్డకు ప్రాణం పోసి వచ్చావా అక్క అని సుమన అంటుంది. అమ్మ మంచి పని చేసింది కదా అని విశాలాక్షి అంటుంది. అయితే గాయత్రి పెద్దమ్మ జాడ ఇక తెలియనట్టేనా అని వల్లభ అంటాడు. నైని మైల పడింది కాబట్టి ఇక గుడికి వెళ్లలేదు అని తిలోతమ అంటుంది. నైని మంచి పనే కదా మా చేసింది మైల ఎక్కడ పడింది అని విశాల్ అంటాడు. తలంటు స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టుకో అని విశాలాక్షి అంటుంది. ఆవిడ ఒక పూజ కూడా చేయమని చెప్పింది విశాలాక్షి అని నైని అంటుంది. ఏమి పూజ నైని అని విశాల్ అంటాడు. ఒక విచిత్రమైన పూజ చెప్పింది తల ఉండదు కానీ జీవం ఉంటుంది ఆవిడకు పూజ చేయమని చెప్పింది అని నైని అంటుంది. ఎంత ఆలోచించినా అలాంటి అమ్మవారు ఉంటుందని అర్థం కావట్లేదు అని తిలోత్తమ అంటుంది. అర్థం కాని పూజ చేయడం ఎందుకు నైని స్నానం చేసి సైలెంట్ గా ఉండు అని విశాల్ అంటాడు. గాయత్రి అమ్మగారి గురించి ప్రాణమైన ఇస్తాను అలాంటిది పూజ ఆపుతాను బాబు గారు అని నైని అంటుంది.ఆ పూజ గురించి నేను చెబుతానమ్మ అన్ని సిద్ధం చేసుకుందువు రా అని విశాలాక్షి నైని ని తీసుకొని వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,అమ్మ బుర్ర లేని మనిషి ఉంటాడు కానీ తల లేని దేవత ఉంటుందా అని వల్లభ అంటాడు. ఎంత ఆలోచించినా అదే అర్థం కావట్లేదు రా అని తిరోత్తమ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
This post was last modified on April 20, 2024 11:20 am
OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More
T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More
Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More
Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More
Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More
ఏపీ సీఎం జగన్పై ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్న ఒకప్పటి వైసీపీ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా… Read More
Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More
ఏపీలో ఎన్నికల అనంతర పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More
రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జరిగింది? అని ఆలోచించుకునేలోగానే సమయం కదిలి పోతుంది. అలా జరిగి ఉండాల్సింది… Read More
ప్రస్తుత ఎన్నికలకు ప్రతి ఒక్క నాయకుడికి కూడా అగ్ని పరీక్షగా మారాయి. మరీ ముఖ్యంగా కొందరు నేతలకు అయితే.. ఈ… Read More
ఏదైనా ఒక విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగితే.. దాని ఫలితం కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఇ ది… Read More
Nuvvu Nenu Prema May 20 Episode 628: విక్కీ పద్మావతి ఇద్దరు అరవింద ఇంటికి వెళ్లి అరవిందతో మాట్లాడుతూ… Read More
Krishna Mukunda Murari May 20 Episode 474: ముకుంద కనిపించట్లేదని ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉంటారు తను… Read More