France Violence: దేశ వ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలతో ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. భారీ ఎత్తున భద్రాతా బలగాలను మోహరించినప్పటికీ నిరసనకారులను అదుపు చేయడం కష్టంగా మారింది. 17 ఏళ్ల నహేల్ అనే యువకుడిని ట్రాఫిక్ తనిఖీల సమయంలో పోలీసులు కాల్చడం వల్ల దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. వరుసగా నాల్గో రోజు హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. పోలీసులు, యువత మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. అల్లర్ల నేపథ్యంలో 875 మందికిపైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. నహేల్ ను కాల్చి చంపిన నాన్ టెర్రేలో సాయుధ బలగాల వాహనాలను తగులబెట్టారు. ఈ హింస క్రమంగ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వరకూ విస్తరించింది. అక్కడక్కడా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. క్లిచి – సౌస్ – బోయిస్ లో సిటీ హాల్, అబర్ విల్లియర్స్ లో బస్ డిపోకు నిప్పు పెట్టారు. భద్రతా దళాలపై టపాసులు ప్రయోగించారు.
ట్వెల్త్ జిల్లాలో పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. రివోలిస్ట్రీట్, లౌవ్రే మ్యూజియం, ప్యారిస్ అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరమ్ డెస్ హోలెస్ లో దుకాణాలను ఆందోళనకారులు లూటీ చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు బాష్పవాయువు, జల ఫిరంగులు, స్టన్ గ్రనేడ్లను ప్రయోగించారు. 40వేల మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. పట్టపగలే కొందరు తీవ్ర స్థాయిలో హింసను పాల్పడుతున్నారు. పారిస్ సహా అనేక ప్రాంతాల్లో దుకాణాలను లూటీ చేస్తున్నారు. శుక్రవారం స్ట్రాస్ బర్గ్ లోని యాపిల్ స్టోర్ లోపలకు నిరసనకారులు చొరబడి అక్కడి సామాగ్రిని దోచుకెళ్లారు. ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఆందోళనకు సోషల్ మీడియానే కారణమని అధ్యక్షుడు మాక్రాన్ ఆరోపిస్తూ.. అల్లర్లకు తమ పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలని కోరారు. అల్లర్లను అణచడానికి సోషల్ మీడియాపై ఆంక్షలను ప్రతిపాదించారు అధ్యక్షుడు మాక్రాన్. హింసాకాండకు ఆజ్యం పోయడంలో స్నాప్ చాట్, టిక్ టాక్ వంటి సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషించాయని ఆయన ఆరోపించారు. సమస్యాత్మక కంటెంట్ ను తొలగించడానికి నిబంధనలు రూపొందిస్తామని ఆయన తెలిపారు. అల్లర్లలో పాల్గొని అరెస్టు అయిన వారిలో మూడింట ఒకవంతు యువకులేనని అధ్యక్షుడు వెల్లడించారు. ఫ్రాన్స్ లో అత్యవసర స్థితితో పాటు శాంతి పునరుద్దరణకు చేపట్టాల్సిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు ఫ్రెంచ్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ తెలిపారు.
ఫ్రాన్స్ లో ఇలా ట్రాఫిక్ తనిఖీల సమయంలో కాల్చిచంపడం కొత్తేమీ కాదని ఆందోళనలు చేస్తున్నారు. 2022 ఒక్క సంవత్సరంలోనే 13 మందిని తనిఖీల సమయంలో పోలీసులు కాల్చి చంపారని ఆందోళనకారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది నహెల్ అనే యువకుడిని కాల్చి చంపడానికి ముందు మరో ముగ్గురిని ఇలాగే కాల్చి చంపారని ఆందోళనకారులు ఆరోపించారు. వచ్చే సంవత్సరం ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలు ఆ దేశాన్ని కలవానికి గురి చేస్తున్నాయి.
అమరావతి భూస్కామ్ లో చంద్రబాబు, పొంగూరు నారాయణ లు ఇలా దొరికేశారు(గా)..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More
Krishna Mukunda Murari May 17 2024 Episode 472: భవానీ దేవి పంతులు గారిని పిలిచి ముకుందా ఆదర్శ… Read More
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More