మోదీ బడ్జెట్ మాయాజాలం!

Published by
Siva Prasad

 

 

 

 

ముందుగా కొన్ని విషయాల గురించి స్పష్టత అవసరం. ప్రభుత్వం ఏమైనా పేరు పెట్టుకోని కానీ ఇది మధ్యంతర బడ్జెట్ కాదు. వ్యయం, పన్నుల విభాగంలో ప్రకటించిన భారీ మార్పులు  మధ్యంతర బడ్జెట్లో అనుమతించే స్వల్ప మార్పుల పరిధికి ఆవల చాలా దూరంలో ఉన్నాయి.

అధికారికంగా ఇంకా కొద్ది నెలలే పదవీకాలం ఉన్న ప్రభుత్వం ఇటువంటి చర్య చేపట్టడం అనేది రాజ్యంగా స్పూర్తికి విరుద్ధం. బడ్జెట్ అమలు అనేది ఆర్ధిక బిల్లులో సవరణలతో కూడుకున్న పని. ఈ ప్రభుత్వం ప్రకటించిన వాగ్ధానాలు-వ్యయం కానీ ( ఉదాహరణ- చిన్న రైతులకి నగదు బదిలీ), పన్నులు కానీ (ఉదాహరణ- వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు) -రాబోయే ప్రభుత్వం మీద ఎనలేని భారాన్ని మోపుతాయి కాబట్టి పదవీకాలం ముగియబోతున్న ప్రభుత్వం రాజ్యంగ విరుద్ధమైన ఇటువంటి చర్య చేపట్టకూడదు.

బహుశా, దురదృష్టవశాత్తు, ఈ రోజు ఇటువంటివి ఎవరికీ పట్టవు అనుకుంటా. అధికారక పదవిలో ఉన్నవారెవరు ఈ రోజు ఇటువంటి ఉల్లంఘనల గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఏది ఏమైనా కానీ, ఈ బడ్జెట్ రాబోయే ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినది అనేది సుస్పష్టం. కాకపోతే మోదీ ప్రభుత్వానికి సర్వసాధారణమైన విధంగా ఈ బడ్జెట్లో కూడా ప్రచారం ఎక్కువగానూ, పన్ను సవరణలు కానీ కేటాయింపులు కానీ తక్కువగానూ ఉన్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవసరమైన మార్పులు లేకపోగా అంతా బాగుంది అనిపించేలా చేసిన ప్రయత్నమే ఈ బడ్జెట్.

ఎంతో మందిలో ఆశలు రేకెత్తించి చివరికి నిర్ఘాంతపరిచిన ఒక పధకం గురించి చూద్దాము. బడ్జెట్ ఉపన్యాసం లో పేర్కొన్నదేమంటే: “ రెండు హెక్టార్ల లోపు వ్యవసాయ యోగ్యపు భూమి ఉన్న చిన్న, సన్నకార రైతు కుటుంబాలకి సంవత్సరానికి 6,000 రూపాయల  చొప్పున ఆదాయ మద్దతు లభిస్తుంది.” ఇది సుమారుగా 12 కోట్ల చిన్న, సన్నకారు  రైతు కుటుంబాలకి లాభం చేకూరుస్తుంది అని ప్రకటించారు. ఈ 12 కోట్ల సంఖ్య బహుశా 2015-16 సంవత్సరపు వ్యవసాయ గణన నుండి తీసుకున్నట్టున్నారు; ఆ గణన ప్రకారం రెండు హెక్టార్ల కంటే తక్కువ ఉన్న వ్యవసాయ భూముల సంఖ్య  సుమారుగా 12.5 కోట్లు. వీరందిరికి దఫాకి 2,000 చొప్పున మూడు దఫాలలో చెల్లిస్తారు.

ఇక్కడ స్పష్టత లేని విషయం ఏమిటంటే ప్రభుత్వనికి ఈ మద్దతు- కౌలు రైతులు, మహిళా రైతులు లాంటి ఎటువంటి పట్టాలు లేని వారికి కూడా- అమలు చేసే ఉద్దేశం నిజంగా ఉందా అని. ఒకవేళ ఉన్నా ఇది ఎలా అమలు చేస్తారు అనే విషయం మీద స్పష్టత లేదు.

ఈ స్పష్టత అనేది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ మద్దతు అనేది ఈ ఆర్ధిక సంవత్సరం నుండే, అనగా డిసెంబర్, 2018 నుండే అమలులోకి వస్తుంది. దీనికోసం 20,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. అదే విధంగా 2019-20 ఆర్ధిక సంవత్సరం కోసం భారీ స్థాయిలో 75,000 కోట్లు కేటాయించారు.

ఇది రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఏ విధంగానైనా ఉపయోగకరంగా ఉంటుందో లేదో అనేది వేచి చూడాల్సిందే. ఈ ప్రతిపాదిత బదిలీని కుటుంబ స్థాయిలో పరిగణిస్తే పెద్దగా ఒరిగేది ఏమి లేదు: కుటుంబానికి నెలకు వచ్చేది కేవలం 500 రూపాయలు. అంతే కాక ఈ రోజు రైతులు అనుభవిస్తున్న ఆర్ధిక ఇబ్బందులని రూపుమాపటానికి ఈ బదిలీ ఏ విధంగాను సహాయపడదు.

కాకపోతే గ్రామీణ ప్రాంతంలో కొనుగోళ్లకి డిమాండ్ పెంచటానికి ఈ బదిలీ స్వల్ప సహాయకారిగా ఉంటుంది. ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తీవ్ర ఆర్ధిక మాంద్య పరిస్థితుల్లో ఈ బదిలీ కాస్తంత ఊరట కలిగించే విషయం.

దేశ ప్రజలను గొప్పగా ఆదుకుంటుందంటూ ప్రకటించిన మరొక వాగ్దానం ఏమిటంటే అసంఘటిత రంగ కార్మికులకి పింఛను పధకం. కానీ ఈ పాటికి మనం అలవాటు పడిపోవలసినటువంటి ఎన్నికల మాయ లాంటిదే ఇది కూడా. ఈ వాగ్దానం ఏమిటంటే అసంఘటిత రంగం లో పనిచేస్తున్న యువకులు (వీరు ఈ రోజు ఇరవయ్యో పడిలో ఉన్నారు అనుకుందాం) ఈ రోజు నుండి డబ్బులు జమ చేస్తూ ఉంటే వారికి 60 సంవత్సరాలు దాటాక నెలకి 3000 రూపాయలు పింఛను వస్తుందంట! అర్హులైన పెద్దలందరికీ కనీస వేతనంలో సగం ఉండవలసిన సార్వజనీన పింఛను పధకం ఆవశ్యకతని అవహేళన చెయ్యటం తప్ప ఈ వాగ్దానం మరేమీ కాదు. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు ఇస్తున్న 3,000 రూపాయల పింఛను పధకంతో చూసుకుంటే ఈ వాగ్దానం దేనికీ కొరగానిది.

పన్ను మినహాయింపు పేరు మీద మధ్యతరగతికి కొన్ని ప్రయోజనాలు ప్రకటించారు. కానీ ఈ ప్రయోజనాలు అన్నీకొంత కాలం తరువాత అమలులోకి వస్తాయి కాబట్టి ఈ రోజున కొనుగోలు డిమాండ్ పెంచటానికి కానీ, ఈ ప్రభుత్వానికి ఎన్నికలలో ప్రయోజనం చేకూర్చటానికి కానీ ఇవి అక్కరకు వచ్చే అవకాశం లేదు.

ఆశ్చర్యకరంగా ప్రభుత్వం ఉద్యోగాల కల్పన విషయంలో ఏమి చేయబోతున్నదీ బడ్జెట్‌లో ప్రకటించలేదు. దీనిని బట్టి మోదీ ప్రభుత్వం నిరుద్యోగం విషయంలో నిప్పుకోడిలాగా తల ఇసుకలో దూర్చి కూర్చుంటానికే సిద్ధమవుతోందని అర్ధమవుతోంది. వివిధ ఆర్ధిక కార్యకలాపాలు బ్రహ్మాండగా ఉపాధి కల్పన చేస్తాయంటూ పీయూష్ గోయల్ తన ప్రసంగంలో చాలాసార్లు పేర్కొన్నారు గానీ, అధికారికంగా దాని గురించి ఏమి చేసేదీ సూచించనే లేదు.

దురదృష్టవశాత్తు మనం గుర్తుంచుకోవలసిన ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే వీరు చెప్పే ఈ విషయాలలో నమ్మశక్యమైనవి చాలా తక్కువ. ఇప్పటికే అధికార సమాచార సేకరణలో కనివినీ ఎరుగని రీతిలో రాజకీయ జ్యోక్యం కారణంగా నీతి ఆయోగ్ అనవసరపు ప్రోద్బలంతో కేంద్ర గణాంకాల కార్యాలయం ( Central Statistical Office) విడుదల చేసిన స్థూల జాతీయ ఉత్పత్తి (Gross Domestic Product) గణాంకాల మీద అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి.  దీనితో జిడిపిలో భాగంగా ఆర్ధిక లోటు, రెవిన్యూ లోటు గణాంకాలు కూడా నమ్మశక్యంగా లేవు.

ఇవి ఇలా ఉంటే, ఏ కేటాయింపులు అయితే పౌరులకి అత్యవసరమో ఆ కేటాయింపుల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వం వాటి మీద దృష్టి కేంద్రీకరించకపోవడం కొనసాగుతోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మీద ప్రభుత్వం చెయ్యదలుచున్న సవరించిన ఖర్చు 61,000 కోట్లు. కానీ ఆ మొత్తం డిసెంబర్, 2018 నాటికే ఖర్చు అయిపోయింది . అంటే దీనర్థం దేశ వ్యాప్తంగా ఆ చట్ట పరిధిలో పనులకి రాబోయే నెలల్లో ఎంత డిమాండ్ ఉండబోతున్నా సరే కేటాయింపు ఏమి ఉండదు అని. ఇప్పటికే ముందు సంవత్సరపు ఖర్చుని తరువాత సంవత్సరంలోకి నెట్టడం అనేది ఒక క్రతువుగా మారింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ క్రతువునే తూ.చ తప్పకుండా పాటిస్తుంది.

మరొక విప్లవాత్మక పధకంగా పేర్కొన్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పధకం మీద పెట్టిన ఖర్చు కేవలం 2,400 కోట్లు. రాబోయే ఆర్ధిక సంవత్సరానికి చేసిన కేటాయింపులు 6,400 కోట్లు. జాతీయ ఆరోగ్య పధకం (National Health Mission) మీద పెట్టబోయే ఖర్చు పెద్దగా పెంచింది లేదు, అలాగే మాటి మాటికి గొప్పగా చెప్పుకునే స్వచ్ఛ భారత్ పధకం మీద కేటాయించిన దాని కంటే 865 కోట్లు తక్కువగా ఖర్చుపెట్టారు. అంతేకాక రాబోయే ఆర్ధిక సంవత్సరానికి దాని కేటాయింపులు 4,228 కోట్లు తగ్గించి 12,750 కోట్లకి పరిమితం చేసారు.

కానీ ఈ మొత్తం బడ్జెట్ గణాంకాలని అకౌంటింగ్ మాయజాలంతో వండి వార్చిన తీరు ముందు గత ప్రభుత్వాలు ఎందుకూ పనికిరావు.

పెట్టుబడి ఉపసంహరణ నుండి వచ్చిన రెవిన్యూ ఇంతకు ముందు వస్తుంది అనుకున్న దానికన్నా ఎక్కువగానే వచ్చింది. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కోనేలాగా ఒత్తిడి చెయ్యడం దీనికి కారణం.

అంతర్గత , బడ్జెటేతర వనరుల ( Internal and Extra-Budgetary Resources) నుండి వచ్చిన వసూళ్లు చాలా భారీ స్థాయిలో 5,58,597 కోట్ల మేరకు ఉన్నాయి. ఇది బడ్జెట్ అంచనా అయిన 4,73,766 కోట్ల కన్నా చాలా ఎక్కువ. ఇంత భారి స్థాయిలో రాబడి కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఒక తొత్తుగా తయారుచెయ్యడం వల్లనే సాధ్యపడుతుంది.

మొత్తం దీనర్థం ఏంటంటే ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి గురించి ఎటువంటి పారదర్శకమైన సమాచారం లేకపోవటం కారణంగా ఈ బడ్జెట్ స్థూల ప్రభావం అంచనా వెయ్యడం దాదాపుగా కుదరని పని. ఇదంతా కూడా సత్యాన్ని మరుగునపరిచే కార్యక్రమం తప్ప ఇంకేమి కాదు.

జయతీ ఘోష్

రచయిత్రి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్ధికశాస్త్రం ప్రొఫెసర్

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

Siva Prasad

Share
Published by
Siva Prasad

Recent Posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024