Target Etala Rajendar: ఈటల రాజేందర్ Target Etala Rajendar ను మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేసిన అంశం తెలంగాణ రాజకీయాల్లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిన విషయమే. అయితే.. ఇది ఏకంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఈటెల రాజేందర్ గా మారిపోయింది. ఆయనపై ఉన్న ఆరోపణలు పక్కకు వెళ్లిపోయి.. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేల్చుకునే వరకూ వెళ్లిపోయింది. ఇంకా ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా హుజూరాబాద్ లో రాజకీయం మొదలైపోయింది. ఇందుకు స్థానికంగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈటెల వెంట ఉన్న నాయకుల్ని టీఈర్ఎస్ వైపే ఉండేందుకు అనేక స్కెచ్ లు రెడీ చేస్తున్నారు.
నిజానికి హుజూరాబాద్ లో ఈటలకు మంచి పట్టుంది. ఉద్యమం నుంచి ఆయన ప్రజలను ఆకర్షించారు. ఆయన మంత్రి అయ్యాక కూడా ప్రజలకు దూరం కాలేదు. అంతగా మమేకం కావడంతో ప్రస్తుత పరిణామాలతో ఈటెల వెంటే అని అందరూ అనేంతగా ఆయనకు ఆదరణ ఉంది. సీఎం కేసీఆర్ కు ఈ విషయాలు తెలియనివి కావు. కానీ.. రాజు తలచుకుంటే ఏమైనా జరగొచ్చు..! టీఆర్ఎస్ అధిష్లానం రంగంలోకి దిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇంచార్జిలకు నజరానాలు ప్రకటిస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీలకు 3-10 లక్షలు, జడ్పీటీసీ, ఎంపీపీలకు 20లక్షల పైగానే ప్యాకేజీలు, ముఖ్య నాయకులకు ఇన్నోవా కార్లు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు దాదాపు 100 కోట్లు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. మన పార్టీ కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తోందా? అంటే స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుకోవడం విశేషం.
Read More: Kcr vs Etela: కేసీఆర్ కు మరోసారి దొరికిన ఈటల..! ఈసారి కుమారుడు నితిన్..!!
మొదటి నుంచీ ఈటెల వెంటే ఉన్న వీణవంక జడ్పీటీసీ దంపతులు తాజా పరిస్థితుల్లోనూ ఈటల వెంటే అని ప్రకటించారు. కానీ.. వారిపై ఓ పాత కేసు బయటకు తీయడంతో మాట మార్చి కేసీఆర్ వెంటే ఉంటమాని ప్రకటించారు. వారి స్వగ్రామంలో వీరిపైనే వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చోటామోటా నాయకులు అందరూ కేసీఆర్ వెంటే అని చెప్పుకుంటున్నా.. ప్రజల్లో ఈటలకు ఉన్న బలాన్ని, నమ్మకాన్ని తిప్పుకోవడం ముఖ్యం. కానీ.. అది సాధ్యమవుతుందా? లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్ధకం. మరి హూజూర్ నగర్ లో పరిస్థితులను భుజాన వేసుకున్న మంత్రి గంగుల కమలాకర్ పరిస్థితులను ఎలా మార్చుకుంటారో చూడాల్సి ఉంది..!
This post was last modified on May 27, 2021 11:49 am
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More
Anasuya Bharadwaj: స్టార్ యాంకర్, నటి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెలబ్రేట్… Read More
Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జరిగింది.… Read More
ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, ఎవరికి వారు అన్నట్టుగా నాయకులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వరకు మార్మోగిన… Read More
రాష్ట్రంలో ఎన్నికలు ఏరేంజ్లో జరిగాయో అందరికీ తెలిసిందే. పెను తుఫాను వచ్చిందా? సునామీ కది లి వచ్చిందా? అన్నట్టుగా ఈ… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు.. ఇతర నియోజకవ ర్గాలతో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య పోరు జోరుగా సాగిన విషయం తెలిసిం దే. ఒకరిపై… Read More
Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More
Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More
May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More