Prakasam barrage కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని భూమిని బంగారం చేసిన ప్రకాశం బ్యారేజ్ 60 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. 1954 మార్చి 1న ప్రకాశం బ్యారేజ్ పునర్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు చేతులమీదుగా శంకుస్థాపనo పెడితే, 1957 నాటికీ బ్యారేజి నిర్మాణం పూర్తయి, నీలం సంజీవరెడ్డి ప్రారంభం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 ఏడాదిలో అవసరం అయ్యే మూడు పంటలకు నీరు అందించే బాధ్యతను బ్యారేజీ తీసుకుంది.
ప్రకాశం బ్యారేజ్ 60 వసంతాలు పూర్తి చేసుకోవడం మాట అటుంచితే ఎప్పటినుంచో బ్యారేజీ వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదికి భారీగా వరద వచ్చినప్పుడల్లా మేట వేసిన ఇసుక ను తొలగించి బ్యారేజీకి సరికొత్త రూపు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం పెరగడంతోపాటు, వరద ప్రభావాన్ని దిగువ ప్రాంతాలకు తగ్గించవచ్చు.
ముఖ్యంగా ముంపు ప్రాంతాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కోసం 102 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, 13 కిలోమీటర్ల మేర బ్యారేజి ఎగువన పూడిక తీస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. 50 లక్షల టన్నుల పూడిక వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం వ్యయాన్ని ఏపీఎండీసీ భరిస్తుంది. పూడికతీత వల్ల ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం 3.071 మెరుగవుతుందని, సుమారు మూడు నుంచి ఐదు మీటర్ల మేర పూడిక తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏ ప్రాంతాల్లో అధికంగా పూడిక ఉందో గమనించి పరిశీలించిన తర్వాత, పనులను మొదలు పెడతారు.
** కళ్లెదుటే నీరు ఉన్న, వచ్చిన నీరంతా సముద్రం పాలు కావడంతో వ్యవసాయానికి అనువుగా ఉండేది కాదు. 1852 ముందు కృష్ణా డెల్టా అంతా కరువుతో అల్లాడే పోయేది. 1833 ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు తో ఈ ప్రాంతంలో 40 శాతం మంది మరణించడంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలని భావించింది.
సరిగ్గా ఈ సమయంలోనే గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించి, ఆ ప్రాంతంలో సాగు నీరు అందేలా చర్యలు చేపట్టడంతో, అదే పద్ధతిలో కృష్ణా నది మీద కూడా మ్యారేజ్ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. 5.80 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో , 1.53 కోట్ల నిర్మాణ వ్యయంతో బ్యారేజీ నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది.
** కాటన్ తో పాటు మరో బ్రిటీషు అధికారి లేక్ వచ్చి బ్యారేజి నిర్మాణం పనులు ఎక్కడ మొదలు పెడితే బాగుంటుంది అనేది పరిశీలించారు. దాని తర్వాత విజయవాడ సమీపంలో బ్యారేజీ నిర్మిస్తే అనువుగా ఉంటుందని దాని మీద బ్లూప్రింట్ సిద్ధం చేశారు. ఈ పనులు పూర్తయ్యే సమయానికి కాటన్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు.
** కాటన్ తర్వాత ఆయన మేనల్లుడు జనరల్ చార్లెస్ ఎ. ఓర్ ప్రకాశం బ్యారేజీ ను పరుగులు పెట్టించారు. 1852 నాటికి ఆరడుగుల ఎత్తులో, 45 కోట్లతో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం మొదటిదశలో పూర్తయింది. అయితే ఇది సరిగ్గా వందేళ్లకు కృష్ణా నదికి వచ్చిన తీవ్రమైన వరదల్లో కొట్టుకుపోయింది. అప్పట్లో ఆగమేఘాల మీద బ్యారేజ్ నిర్మించడంతో పాటు, అలాంటి అనువైన పద్ధతులు అవలంబించడం పోవడంతో బ్యారేజి వందేళ్లకు పాడైంది. దీన్ని మళ్లీ పునర్నిర్మించేందుకు టంగుటూరి ప్రకాశం పంతులు పునుకున్నారు.
** అప్పటి వరద ఉధృతికి ప్రాజెక్టుకు ఒక్కొక్కటి గండి పడటంతో వాటిని నివారించేందుకు అప్పటి ప్రాజెక్టు అధికారి వేపా కృష్ణమూర్తి ప్రయత్నించారు. ఒక చిన్న స్టీమర్ లో ఇసుక బస్తాలు సిమెంటు బస్తాలు కంకర వేసుకొని వెళ్లి గండి పుడ్చాలని ప్రయత్నించారు. అయితే వరద ఉధృతి పెరగడంతో కృష్ణమూర్తి తోపాటు నలుగురు ప్రాజెక్టు అధికారులు మృతి చెందారు.
** ప్రకాశం బ్యారేజ్ పునర్నిర్మాణంలో దాదాపు అందరూ తెలుగువారే పాలుపంచుకున్నారు. ప్రథమ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సుబ్రహ్మణ్యం, విజయవాడ సర్కిల్ సూపర్నెంట్ ఇంజనీరుగా నరసింహారావు పని చేస్తే వారి టీమ్ లోని మిగిలిన వారి అధికారులు సైతం తెలుగు వారే కావడం విశేషం. అప్పట్లో ప్రాజెక్టుకు 2. 38 కోట్లు వ్యయం అయింది.
** ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కృష్ణా తూర్పు డెల్టా కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలుగా విభజించి సాగునీరు అందిస్తోంది. 13.08 ఎకరాలకు దీని ద్వారా నీరు అందుతుంది. రెండు డెల్టా ల పరిధిలో 14 కాలువల ద్వారా సాగునీటితో పాటు తాగు నీరు అందుతుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, ఏలూరు, బందరు వంటి పట్టణాలతోపాటు సుమారుగా 1400 గ్రామాలకు తాగునీరు ను ఇవి అందిస్తున్నాయి.
** కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో బందరు కాలువ 77.80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ, 1,37,786 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అలాగే కృష్ణా పశ్చిమ డెల్టాలో భాగమైన కృష్ణా పశ్చిమ గట్టు కాలువ 74.20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 1,55,344 ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరు అందుతోంది.
** మ్యారేజ్ 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ వేదికగా అప్పటి అధికారులను సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన 18 మంది సెక్షన్ అధికారులు ఉన్నట్లు గుర్తించారు. వీరిని సన్మానం చుకుని, చిరునవ్వే ప్రకాశం బ్యారేజ్ కు ఓ గొప్ప శాల్యూట్ చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు పూడికతీత పనులతో బ్యారేజీ కొత్తకళ సంతరించుకుంటే, మరో వైపు నిర్మాణంలో పాలు పంచుకున్న ధీరులను సన్మానించుకుని విజయ గర్వంతో తలపైకి ఎత్తుకుని నిలబడింది.
This post was last modified on March 17, 2021 11:05 am
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More
Krishna Mukunda Murari May 17 2024 Episode 472: భవానీ దేవి పంతులు గారిని పిలిచి ముకుందా ఆదర్శ… Read More
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More