కడప రాజకీయాలలో ఇప్పుడు వైఎస్ సౌభాగ్యమ్మ పేరు మార్మోగుతోంది. ఏ ఇద్దరు కలిసినా.. ఆమె గురించే చర్చించుకుంటున్నారు. దీంతో అసలు ఆమె ఎవరు? ఇప్పుడు ఎందుకు తెరమీదికి వస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. 2019 ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి సతీమణే.. సౌభాగ్యమ్మ. 2021 వరకు ఆమె పేరు ఎవరికీ కూడా తెలియదు. తెలిసినా. కడప వరకే పరిమితం. కానీ, ఆతర్వాత.. ఆమె హైకోర్టుకు వెళ్లడం.. తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని, విచారణ చేపట్టాలని కోరడంతో వెలుగులోకి వచ్చారు.
ఇక, ఆ కేసు సంగతి విచారణ దశలోనే ఉంది. కానీ, ఇప్పుడు ఎన్నికలకు ముందు సౌభాగ్యమ్మ పేరు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమెను కడప లేదా.. రాజంపేట పార్లమెం టు స్థానాల నుంచి పోటీకి నిలబెట్టాలనేది.. సీఎం జగన్ తో విభేదిస్తున్న వైఎస్ కుటుంబం సభ్యుల ఆలోచన. ప్రస్తుతం వైఎస్ వివేకా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కుటుంబం.. దీనిలో తమకు న్యాయం జరగాలంటే.. అధికారబలం కూడా అవసరమని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే సౌభాగ్యమ్మను ఎంపీ చేసుకుంటే.. కొంత తమకు నైతికంగా బలం చేకూరుతుందని అనుకుంటున్నారు. దీనికి తోడు.. తమకు ఏమాత్రం సహకరించడం లేదని భావిస్తున్న వైసీపీ అధిష్టానాని కి కూడా తమ బలం ఏంటనేది చూపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన అన్నపై షర్మిల సౌభాగ్యమ్మ అస్త్రాన్ని వాడి తన సత్తా ఏంటో చూపించాలని బలంగా డిసైడ్ అయినట్టు కూడా టాక్ ?
ఇటీవల ఇదే విషయంపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల.. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతలు దృష్టి పెట్టారు. కాంగ్రెస్లో చేరితే.. కడప సీటు ఇచ్చి సౌభాగ్యమ్మను గెలిపించుకునే బాధ్యతను తాను తీసుకుంటానని షర్మిల చెప్పినట్టు కడప పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది.
అయితే.. కడప నుంచి షర్మిల పోటీ చేస్తేనే బాగుంటుందని సునీత అభిప్రాయపడగా.. రాజంపేట నుంచి అయినా.. సౌభాగ్యమ్మను నిలబెట్టాలని షర్మిల భావిస్తున్నారు. ప్రస్తతం ఈ చర్చలకు ఇంకా ముగింపు రాలేదు. ఎన్నికలకు ముందు .. దీనిపై స్పష్టత రానుంది. కానీ, క్షేత్రస్థాయిలో సౌభాగ్యమ్మ పొలిటికల్ ఎంట్రీపై స్థానికులు చర్చించుకోవడం.. వారి అభిప్రాయాల్లో ఆమె గెలుపు ఖాయమని కొందరు బలమైన పోటీ ఇస్తారని మరికొందరు చెబుతుండడం గమనార్హం. ఈ పరిణామాలను వైసీపీ కూడా నిశితంగా గమనిస్తుండడం మరో విశేషం. ఆమె ఎక్కడ నిలబడినా గెలుస్తారని.. కొందరు అంచనా వేస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More
Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More
Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More
Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More
ఏపీ సీఎం జగన్పై ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్న ఒకప్పటి వైసీపీ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా… Read More
Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More
ఏపీలో ఎన్నికల అనంతర పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More
రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జరిగింది? అని ఆలోచించుకునేలోగానే సమయం కదిలి పోతుంది. అలా జరిగి ఉండాల్సింది… Read More
ప్రస్తుత ఎన్నికలకు ప్రతి ఒక్క నాయకుడికి కూడా అగ్ని పరీక్షగా మారాయి. మరీ ముఖ్యంగా కొందరు నేతలకు అయితే.. ఈ… Read More
ఏదైనా ఒక విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగితే.. దాని ఫలితం కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఇ ది… Read More
Nuvvu Nenu Prema May 20 Episode 628: విక్కీ పద్మావతి ఇద్దరు అరవింద ఇంటికి వెళ్లి అరవిందతో మాట్లాడుతూ… Read More
Krishna Mukunda Murari May 20 Episode 474: ముకుంద కనిపించట్లేదని ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉంటారు తను… Read More
May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More
Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More
YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More