ప్రజాస్వామ్య దేశంలో పాలకపక్షం ఎంత బలంగా ఉండాలో ప్రతిపక్షం అంత కంటే బలంగా ఉండాలి… అప్పుడే ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.. ఇప్పుడు భారత దేశానికి ఇదే లోపించినట్లు కనిపిస్తోంది. బిజెపి ఎంత బలంగా కనిపిస్తున్నట్లు నటిస్తుందో దానికి తగినట్లుగా కాంగ్రెస్ అంత బలహీనంగా కనిపిస్తోంది… కాంగ్రెస్ పార్టీ ను ప్రత్యర్థులు ఎవరు బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య అదే చేసుకుంటుంది… ఇప్పటికే కేంద్ర స్థాయిలో దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతున్న తరుణంలో తెలంగాణ లో కాస్త బలంగా ఉన్నట్టు మొన్నటి వరకు కనిపించిన కాంగ్రెస్ ఇప్పుడు అంతర్గత కలహాలతో కాకవికాలం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొత్త కాదు కానీ.. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అంతిమ దశలో ఉన్న పరిస్థితుల్లో, బిజెపి పూర్తిగా పుంజుకుంటున్న దశలో కాంగ్రెస్ పార్టీని మరింత దిగజార్చే రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో జరుగుతుండటం శోచనీయం… తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం ఇప్పుడు అంతర్గత రాజకీయ ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రారు గానీ పదవులు తీసుకోవడానికి మాత్రం అంతా మేమే ఉన్నమంటారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిస్థితిలో మాత్రం మార్పు ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ కొన్న గొప్ప విషయం ఏమిటంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారు సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఇముడ్చుకుంటారు.. ఒకరికి పదవిస్తే మరొకరికి బాధ అన్నట్లు, పార్టీ బాగుపడితే పాము బాగుపడతామని సంగతిని పక్కనబెట్టి కేవలం పదవులకోసం పంచాయతీలు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ విఫలం కావడంతో ఇది పెద్ద అంశం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లో పూర్తిగా విఫలమైంది. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం ఒక ఎత్తయితే, అంతర్గత రాజకీయాల్లో ఒకరు మంచి పేరు సాధిస్తే మరొకరు నాశనం అవుతామనే ఆలోచన ధోరణి తోనే పార్టీ వెనుక బడుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను రాజకీయ శత్రువులు దెబ్బతీయాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలోని వారే వెన్నుపోట్లు పొడుస్తారు. పదవులు రాకుండా అడ్డుక వేస్తారు. తమకు లాభం చేకూర్చిన చెక్కు రాకపోయినా పర్వాలేదు గానీ తమ పక్కన రోడ్డు బాగు పడకూడదు మనస్తత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులది… ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి ఉన్న కాస్త ఊపిరి ఆ పార్టీ నాయకులు తీసేయడానికి సిద్ధమవుతున్నారు.
మొన్నటివరకు తెలంగాణ పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి కి తర్వాత పిసిసి బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగిస్తానని ప్రచారం జోరుగా జరిగింది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం కూడా సుముఖత వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఒక్కడే ప్రచారంలో జోరుగా పాల్గొనడం తో పాటు తన మల్కాజిగిరి లోక్సభ పరిధిలో రెండు సీట్లను గెలిపించుకోగలగారు. అయితే రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు రుచించడం లేదు. నిన్నకాక మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ కు అధిక ప్రాధాన్యం ఇస్తే తమ సంగతేమిటంటే వారు రుసరుస లాడుతున్నారు.
** మొన్నటి వరకు రేవంత్ రెడ్డి పదవి మీద అనుకూల వ్యాఖ్యలు చేసిన తెలంగాణా కాంగ్రెస్ పరిశీలకుడు మాణిక్యం ఠాకూర్ ఇప్పుడు తాజాగా మాట మార్చడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ పిసిసి చీఫ్ రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. రేవంత్ కు కోమటిరెడ్డి నుంచే ప్రధాన పోటీ. కాంగ్రెస్ పార్టీని ఎప్పటినుంచో నమ్ముకుని ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. కేంద్ర స్థాయిలో ను డిల్లి స్థాయిలోనూ ఆయనకు గత అనుభవాలు పరిచయాలు ఇప్పుడు ఉపయోగపడతాయి. పీసీసీ చీఫ్ రేస్ ను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కోమటిరెడ్డి లోలోపల రాజకీయం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
** ఇక పీసీసీ చీఫ్ రేస్లో మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా కాంగ్రెస్ పార్టీ కు సీనియర్లు. మొదటి నుంచి కాంగ్రెస్ ని నమ్ముకుని ఉన్న వాళ్లు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గతంలో ఉన్న వారికే పిసిసి చీఫ్ పదవి ఇవ్వాలని వీరంతా బలంగా కోరుతున్నారు.
** టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ సరిపోవడం లేదు. వదిన మాటలు కెసిఆర్ను మాటల ద్వారా ఎదుర్కొనే దమ్మున్న నాయకులు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో లేకపోవడమే పెద్ద మైనస్. ఇప్పటివరకు పార్టీ వెనుక పట్టడానికి ఇదే పెద్ద కారణం. రేవంత్ రెడ్డి వచ్చాక కెసిఆర్ ను ఆయన భాషలోనే తూర్పార బ ట్టడంట్టంలో ముందున్నారు. ప్రతి విషయానికి కౌంటర్ అటాక్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి భాషను ఉపయోగిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లిన ప్రజాదరణ అమోఘం. జనం తండోపతండాలుగా వస్తారు. ఇది ఆయనకు పెద్ద అసెట్. రేవంత్ రెడ్డి లా ప్రజాదరణ మాటలతో సమాధానం చెప్పే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ లేకున్నా ఆయనకు సీనియారిటీ లేదనే ఒక్క ప్రతిపాదికన పిసిసి అధ్యక్ష పదవికి మోకాలడ్డు తున్నారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలుసుకున్నారు. త్వరలో కాంగ్రెస్ పగ్గాలు అన్ని రాహుల్ గాంధీ చేపట్టబోతున్నా తరుణంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాధికారాన్ని ఆయనకు కట్టబెట్టే యోచనలో సోనియాగాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ తో రేవంత్ రెడ్డి కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో పోటీ సమయంలోనూ రాహుల్ గాంధీ రేవంత్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల అయిపోయిన అనంతరం పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ జరుగుతున్న సమయంలో రేవంత్రెడ్డి రాహుల్గాంధీని ప్రత్యేకంగా కలుసుకోవడం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశమైంది.. రాహుల్ గాంధీ సైతం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రేవంత్ కు పదవి అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా ఉంటుంది అలాంటి కదలికలు జరుగుతాయి ఎలాంటి మార్పులు జరుగుతాయి అన్నది వేచి చూడాలి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని శత్రువులు చంపాల్సిన అవసరం లేదు… అది బలవన్మరణానికి పాల్పడుతోంది.
This post was last modified on December 16, 2020 1:18 pm
Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More
YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More
Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More
Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More
OTT: ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More
Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More
Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More
Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More
JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More