ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కాకుండా మరొక హాట్ టాపిక్ ఉంది. కరువు ప్రాంతం రాయలసీమకు నీరు అందించేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయమై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయగా తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిపై ఫైర్ అవుతాడు అనుకుంటే చివరికి అతను కూడా ఆచితూచి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వీలైనంత ఎక్కువ నీటిని తమ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలించేందుకు అనేక ప్రాజెక్టులకు అనుమతులు లేకుండానే నిర్మిస్తున్న నేపథ్యంలో కెసిఆర్ పోతిరెడ్డిపాడు పై అనుకూలంగా మాట్లాడారు.
అయితే ఇక్కడితో ఈ విషయం సద్దుమణిగిపోయింది అని అంతా అనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై విపరీతంగా ఫైర్ అవుతున్నారు. గతంలో వైయస్ హయాంలో అటు తెలంగాణా మరియు ఆంధ్రకు సంబంధించి ఏ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినా జైకొట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం గమనార్హం. రాయలసీమకు నీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిందే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోమటి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.ఇక వారితో పాటు చంద్రబాబు నాయుడు శిష్యుడు మరియు ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా పోతిరెడ్డిపాడు సామర్థ్యంపై భగ్గుమన్నారు.
పార్టీ హైకమాండ్ నుండి ఎటువంటి ఆదేశం రాకుండానే అతనికి అతనే సొంతంగా ఈ అంశంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. మొదటి నుండి కాంగ్రెస్ నేతలు ఆంధ్ర-తెలంగాణ మధ్య విభేదాల రాజకీయంతోనే తమ పోరాటం మొదలు పెట్టిన దాఖలాలు ఎన్నో. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో ఎటువంటి కామెంట్స్ చేయడం కుదరదు కానీ రేవంత్ రెడ్డి అటు నుంచి ఈ విషయాన్ని వాడుకొని తన పొలిటికల్ మైలేజ్ పంచుకుందామని బాగా యాక్టివ్ అవుతున్నారు.
ఇక రేవంత్ రెడ్డి అందులో భాగంగా…. పోతిరెడ్డిపాడు కి వ్యతిరేకంగా కేసీఆర్ ఏనాడూ పోరాటం చేయలేదని కానీ గతంలో మాత్రం తాను దాన్ని వ్యతిరేకించాలని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాయలసీమకు నీరు అందించే ప్రాజెక్టులను ముందుకు సాగనివ్వమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించగా ఇందుకోసం తాను ఉద్యమం చేస్తానని కూడా చెప్పారు.
తెలంగాణను పద్ధతి ప్రకారం ఎండబెట్టే కుట్ర చేస్తున్న కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, ఆయన్ను బొంద పెట్టినా పాపం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 70% పనులు పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయలేని అసమర్థుడు కేసీఆర్ అన్నారు. ఇలా ఒక్కసారిగా రేవంత్ రెడ్డిలో లేని ఉత్సాహానికి ఊపిరిలూదిన వారయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు.
This post was last modified on May 29, 2020 11:00 pm
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More