విజయవాడ, ఏప్రిల్ 5: ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో జాతీయ స్థాయి రాజకీయాలకు సంబంధించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నరేంద్ర మోది గెలిస్తే భవిష్యత్లో అసలు ఎన్నికలు ఉంటాయా అనే అనుమానాలున్నాయని సుధాకరరెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్,బిజెపి భావజాలంతో చేసిన పాలన ఐదేళ్లు చూసాము, రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి సగం కూడా సృష్టించలేకపోయారని సుధాకరరెడ్డి ఆరోపించారు. ఆర్ధిక విధానాలు పెట్రోల్, డీజల్,నిత్యావసర ధరల నియంత్రణ చేయలేకపోయారని విమర్శించారు.
అంబానీ,అదాని వంటి కొంత మందికే లబ్ది చేకూరే విధానాలు తీసుకు వచ్చారని సుధాకరరెడ్డి అన్నారు. గోరక్షణ పేరుతో దళితులపై దాడులు, రిజర్వేషన్లకై పోరాడిన దళితులపై కేసులు పెట్టారని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 15 నియోజకవర్గాల్లో టిడపి అసెంబ్లీ అభ్యర్థులపై దాడులు చేయడం చూస్తునే ఉన్నామని సుధాకరరెడ్డి అన్నారు. ప్రతిపక్షాలన్నీ దేశ ద్రోహులనీ,హిందు వ్యతిరేకులనీ స్వయంగా ప్రధాని ప్రచారం చేస్తున్నారని సుధాకరరెడ్డి విమర్శించారు.
పుల్వామా దాడుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంనేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు.
జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు అవగాహన లేకుండా అసాధ్యమనీ,ముందు అవగాహన కలిగి ఉండాలని సుధాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. 40 పార్టీలతో బిజెపి ఫ్రంట్ పెట్టినప్పుడు 23 పార్టీలతో ఫ్రంట్ ఎందుకు సాధ్యం కాదని సుధాకరరెడ్డి ప్రశ్నించారు. కొన్ని పార్టీలు అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రయత్నించకపోవడం జరుగుతోందని అన్నారు.
వయనాడ్లో రాహుల్ గాంధీ వామపక్ష పార్టీకి ఎదురు పోటీ చేయడం ఒక తప్పుడు సంకేతం వెళుతుందని సుధాకరరెడ్డి అన్నారు.
బిజెపికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఒక ప్లాట్ఫారం తీసుకు వచ్చిందని సుధాకరరెడ్డి పేర్కొన్నారు. తక్కువ సీట్లు ఉన్నా పార్టీలు అధికారంలో భాగస్వామి కావాలని చూస్తున్నాయని అన్నారు. ‘మేము ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము,అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం’ అని సుధాకరరెడ్డి అన్నారు.
యుపిఎ హయాంలో ప్రతిపక్షంలో ఉంటూనే అధికార పక్షానికి మద్దతిచ్చామని గుర్తు చేశారు. మతోన్మాద పార్టీని అధికారంలో నుండి తొలగించాల్సిన అవసరం ఉందనీ, సెక్యూలర్ ప్రభుత్వ ఏర్పాటు వంటివి ప్రధాన అంశాలతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని సుధాకరరెడ్డి వెల్లడించారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More
Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుదలైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం.… Read More
Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More
NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More
Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More
Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More