గుంటూరు: తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు. రాజధాని రైతులు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నా రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై మంత్రులు రోజుకో ప్రకటన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం రైతులు మధ్య చిచ్చుపెట్టవద్దని అన్నారు. రాజధానిని అభివృద్ధి చేయాలన్నదే ఈ ప్రాంత రైతులందరి ఏకైక డిమాండ్ అన్నారు.
చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడం కోసం రాజధానిని వాడుకోవద్దని చెప్పారు. రైతులకు పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. రైతులందరం ఒకే మాటగా ఉన్నామని పేర్కొన్నారు. రైతుల కోసం టిడిపి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే పోటీగా వైసిపి నేతలు సమావేశం పెట్టారని అన్నారు. రెండు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యేని రాజకీయాలకు అతీతంగా అందరం రైతులు కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని కోరితే రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంత వరకూ ఏర్పాటు చేయలేదనీ, నేడు టిడిపి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంటే పోటీగా రైతులతో సమావేశం అంటూ పిలుపు ఇచ్చారనీ, ఈ సమావేశానికి రాజధాని రైతులకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
ఇప్పటికైనా మంత్రులు రాజధాని రైతుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి స్పష్టమైన ప్రకటన ఇప్పించాలని డిమాండ్ చేశారు. భూసేకరణలో కుంభకోణాలు జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదని రైతులు ప్రశ్నించారు. రాజధాని రైతులకు ఎవరూ లేరనుకుంటున్నారేమో, శంకుస్థాపన చేసిన ప్రధాని మోది, కేంద్ర మంత్రి అమిత్ షా, తమకు మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర రాజకీయ పార్టీల నేతల మద్దతు ఉందని వారు స్పష్టం చేశారు.
This post was last modified on December 5, 2019 12:38 pm
YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల… Read More
ACB Raids On ACP: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ… Read More
CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More
AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More
ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More
Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More
Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More
Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More
Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More
Harom Hara Release Date: హరోం హర మూవీ సుదీర్ బాబు కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గారు… Read More
Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More
Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More
Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More
Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More