కాలం కలిసి రావడమంటే ఇలానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఇప్పుడు ఆ యువ నేతకు పట్టం కట్టేందుకు నియోజకవర్గం ప్రజలు రెడీగా ఉన్నారు. అదే అమలాపురం ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీల అభ్యర్థిగా గంటి మోహనచంద్రబాల యోగి కుమారుడు, యువ నేత హరీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. అయితే.. అప్పట్లో వైసీపీ హవా, మహిళా నాయకురాలు చింత అనురాధ సెంటిమెంటుతో గంటి వారసుడు గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. కానీ, గట్టి పోటీ అయితే ఇచ్చారు.
ఇక, ఇప్పుడు రెండు రకాలుగా మాధుర్కు కాలం కలిసి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పోటీ చేస్తున్నారు. అయితే.. ఆయన ముందుగానే అస్త్ర శస్త్రాలు వదిలే శారనేటాక్ ఉంది. ఎందుకంటే.. తనకు, తనస్థాయికి మించిన సీటుగా ఆయన భావిస్తున్నారు. దీంతో ప్రచారంలో ఇంకా స్పీడు అందుకోలేక పోతున్నారు. అంతేకాదు.. నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఇక్కడ ఊపు కనిపించడం లేదు. పైగా కోనసీమ జిల్లా పేరు మార్పు నేపథ్యంలో జరిగిన వివాదాలు, మంత్రి ఇల్లు దహనం.. కేసులు.. ఇలా.. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకోవడం వంటివి సెగ పుట్టిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఓ మంత్రిపై ఉన్న కోపం.. ఈ ఎన్నికల్లో పార్టీకి సెగ పెడుతోంది.
ఇంకోవైపు.. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్ధి, టీడీపీ నేత గంటి హరీష్మాధూర్ ప్రచారంలో దూకుడు గా వ్యవహరిస్తు న్నారు. ఇప్పటికే మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాలతో పాటు అమలాపురంలో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు.. జనసేనలో యువతను కలుపుకొని పోతున్నారు. ఇక, సొంత పార్టీ టీడీపీలో అందరూ గంటి వారసుడికే జై కొడుతున్నారు. దీనికి తోడు తండ్రి మరణం తర్వాత.. గంటి కుటుంబం నుంచి రాజకీయంగా ప్రాధాన్యం లభించలేదు.
ఈ నేపథ్యంలో ఈ సారైనా గంటి కుటుంబాన్ని గెలిపించుకుని తీరాలన్న కసి.. ఇక్కడి ప్రజల్లో స్ఫస్టంగా కనిపిస్తోంది. గత ఎన్నిక ల్లో ఓటమికి సంబందించి సానుభూతి, జీఎంసీ బాలయోగి కుమారుడు కావడం ఆయనకు కలిసొస్తున్నారు. ఇంకో వైపు జనసే న యూత్ ఓట్లు.. యువ నాయకుడు అనే టాక్ కూడా గంటికి అనుకూలంగా మారాయి. మొత్తంగా చూస్తే.. అమలాపురం స్థానంలో ఈ దఫా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కినట్టేనని అంటున్నారు పరిశీలకులు. కూటమి బలం.. తండ్రి వారసత్వం.. ప్రభుత్వ వ్యతిరేకత ఇలా.. పలు అంశాలు ఈ దఫా గంటి మాధుర్కు విజయాన్ని అందించడం ఖాయమని చెబుతున్నారు.
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More