YS Jagan: ఒక నాటి ప్రముఖ సువార్తకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే ముందుగా అనుమతి తీసుకోకపోవడంతో కేఏ పాల్ ను కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో కొద్ది సేపు ఎదురుచూసిన కేఏ పాల్ అక్కడి నుండి వెనుతిరిగారు.
ప్రజా సమస్యలపై చర్చించి వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేద్దామని చెప్పేందుకు వచ్చానని అన్నారు కేఏ పాల్. మంగళ, బుధవారం విజయవాడలోనే ఉండి వేచి చూస్తానని చెప్పారు. ఎంతో మంది దేశాధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారని, రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. తనను కలిసేందుకు అవకాశం ఇస్తే దీవిస్తానని అన్నారు. తనను తిరస్కరిస్తే భగవంతుడిని తిరస్కరించినట్లేనని వ్యాఖ్యానించారు.
తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ కూడా మాజీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు కేఏ పాల్. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తారో, 75 సీట్లు గెలుస్తారో, 25 సీట్లు గెలుస్తారో తనకు తెలియదన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తూ డిపాజిట్ కూడా దక్కించుకోని కేఏ పాల్ .. తరచు ప్రముఖుల పేర్లు చెబుతూ, హాస్యాస్పద కామెంట్స్ చేస్తూ పొలిటికల్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. సీఎం జగన్ ను ఇప్పటి వరకు కలవలేదని, ఇప్పుడు కలవడానికి వచ్చానని చెప్పుకున్నారు.
గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. అటు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా పలు మార్లు సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఇటువంటి కేఏ పాల్ కు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్..ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. నిత్యం పలు జిల్లాల ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో కేఏ పాల్ కు అవకాశం ఇస్తారో లేదో మరి.
YSRCP: రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు చేసిన వైసీపీ
This post was last modified on January 9, 2024 7:01 pm
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More