YSRCP: ఏపీ నుండి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీ నుండి ఆరేళ్ల క్రితం రాజ్యసభ కు ఎంపికైన వారిలో వైసీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీడీపీ నుండి సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ లు ఉన్నారు.
వీరి పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనుండటంతో మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి ఉన్న బలం ప్రకారం మూడు స్థానాలు వైసీపీ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే వారి స్థానంలో ముగ్గురు అభ్యర్ధులను సీఎం జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తొంది.
వీరిలో ఒక ఎస్సీ అభ్యర్ధికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారుట. ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో బీసీలకు పెద్ద పీట వేసిన వైసీపీ .. ఈ సారి ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఒకరిని ఎస్సీ సామాజిక వర్గం నుండి ఎంపిక చేసినట్లుగా తెలుస్తొంది. ఇప్పటికే ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. త్వరలో ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధుల పేర్లను వైసీపీ ప్రకటించనుంది. అయితే ఎవరికి అవకాశం దక్కుతొందని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకపోయినా టీడీపీ నాల్గో అభ్యర్ధిని పోటీకి బరిలో దింపితే ఏమి చేయాలనే దానిపైనా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తొంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగా క్రాస్ ఓటింగ్ జరిగితే ఓ రాజ్యసభ స్థానం వైసీపీ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
CM YS Jagan: శింగనమల ఎమ్మెల్యే పద్మావతి పై సీఎం వైఎస్ జగన్ సీరియస్ .. ఎందుకంటే..?