Aamani: 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారల్లో ఆమని ఒకటి. బెంగళూరులో జన్మించిన ఆమని.. తమిళ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించింది. సినీ పరిశ్రమలోకి వచ్చిన ఏడాది కాలానికి హీరోయిన్ గా మారింది. 1993లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాతో ఆమని తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది. ఈ సినిమాలో నరేష్ సరసన కథానాయకగా నటించింది. తొలి సినిమాతోనే ఇక్కడ భారీ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ కు జోడీగా మిస్టర్ బెల్లం మూవీలో యాక్ట్ చేసి తెలుగు వారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమాకు గానూ ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకుంది.
దాంతో ఆమనికి తెలుగులో మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. అమ్మ కొడుకు, పచ్చని సంసారం, ప్రేమ నా ప్రాణం, కన్నయ్య కిట్టయ్య, చిన్నల్లుడు, రేపటి రౌడీ, శ్రీవారి ప్రియురాలు, తీర్పు, శుభలగ్నం, అల్లరి పోలీస్ ఇలా ఎన్నో చిత్రాల్లో ఆమని హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా శుభలగ్నం సినిమా ఆమనికి భారీ స్టార్డమ్ తీసుకొచ్చింది. తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, కృష్ణ వంటి నటలతో ఆడి పాడింది. అలాగే తమిళ్, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసిన ఆమని.. 1997 తర్వాత కొన్నాళ్లు వెండితెరపై కనిపించలేదు.
ఇండస్ట్రీ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకున్న ఆమె మళ్ళీ 2004లో మధ్యాహ్నం హత్య మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికీ అడపా తడపా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తుంది. అలాగే బుల్లితెరపై సీరియల్స్, టీవీ షోస్ లో కనిపిస్తూ అలరిస్తోంది. ఇక ఆమని పర్సనల్ లైఫ్ వస్తే.. హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలోనే తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను ఆమని పెళ్ళి చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడితో పాటు ఒక కుమార్తె జన్మించింది.
వివాహం అనంతరం భర్త కోరిక మేరకు కొన్నాళ్లు ఆమని సినిమాల్లో కనిపించలేదు. కానీ నటనపై మక్కువ చంపులేక ఆమె మళ్లీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అయితే రీల్ లైఫ్ లో ఇల్లాలు పాత్రల్లో పర్ఫెక్ట్ గా ఇమిడిపోయి ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఆమని.. రియల్ లైఫ్ లో మాత్రం ఇల్లాలుగా ఇమడలేకపోయింది. భర్తతో ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయింది. పిల్లలు పుట్టిన కొన్నేళ్లకు మొహియుద్దీన్ తో ఆమని విడాకులు తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించింది.
తొలిసారి తన విడాకులపై నోరు విప్పుతూ సంచలన విషయాలు బయటపెట్టింది. `విడాకులు నిజమే.. కానీ తామిద్దరం ఒక అండర్ స్టాండింగ్తోనే విడిపోయాము. నాకు సినిమాలంటే ఇష్టం, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. తమ మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఫ్రెండ్లీగానే తామిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాము. అయితే విడాకులు తీసుకున్నా కూడా ఇప్పటికీ ఇద్దరం టచ్లోనే ఉన్నాము. అప్పడప్పుడు కలుస్తుంటాము. ఇక పిల్లల బాధ్యత నేనే తీసుకున్నాను. వారే నా ప్రపంచం` అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమని తన పర్సనల్ లైఫ్ పై కామెంట్స్ చేసింది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!