EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది.
ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్ల ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది.
పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ పేర్కొంది. లబ్దిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఎలక్ట్రానిక్ విధానాల (డీబీటీ) ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా అందజేయవచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పినట్లు వెల్లడించింది. లబ్దిదారులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సూచించింది.
Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి