Karthika Deepam 2 April 27th 2024 Episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. స్టేషన్ ముందు మీడియా వాళ్ళు జ్యోత్స్న గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటల విని జ్యోత్స్న కృంగిపోతుంది. ఇంటిదగ్గర పారిజాతం.. దీప మీద అరుస్తూ ఉంటుంది. నీ ప్రాణం కాపాడింది అన్నావ్ ఇప్పుడు నీ పరువే తీసింది. దీనంతటికీ కారణం దీప అని పారు ఫైర్ అవుతుంది. నిన్న ఈ టైం కి కేక్ కట్ చేస్తూ సంతోషంగా ఉన్నా నా మనవరాలు సంతోషంగా ఉంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉందని పారు అంటుంది. ఆపండి అత్తయ్య నా కూతురు ఇలాంటి పని చేసింది అని బాధపడుతుంటే మీరు దీపని తిడుతున్నారేంటని సుమిత్ర అడ్డం పడుతుంది. దీప నిజం మాత్రమే చెప్పింది తప్పు చేసింది నా కూతురు అని ఏడుస్తుంది. దీప ని ఇంట్లో నుంచి గెంటేస్తే కానీ సరిపోద్దని పారు అరుస్తుంది. దీపని అనాల్సిన అవసరం లేదని సుమిత్ర చెబుతుంది. లాయర్ జ్యోత్స్న కి బెయిల్ తీసుకుని వస్తాడు. కార్తీక్ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. తనని చూడగానే జ్యోత్స్న వెళ్లి కౌగిలించుకుని ఏడుస్తుంది.
నేను విన్నది నిజమేనా అని కార్తీక్ అంటే అవునని తలాడిస్తుంది జ్యోత్స్న. తన ప్రమేయం లేకుండానే జరిగిందని చెప్పి బాధపడుతుంది. మరి అంతగా ఎందుకు తాగావు అంటాడు కార్తీక్. బెయిల్ రావడంతో జ్యోత్స్న నీ రిలీజ్ చేస్తారు. బయట మీడియా ఉందని ఫేస్ కవర్ చేసుకోమని చెప్పి కార్తీక్ తనని తీసుకుని వెళ్తాడు. పోలీస్ స్టేషన్ బయట ఉన్న మీడియా వాళ్ళు జ్యోత్స్న నీ ప్రశ్నలతో వేధిస్తారు. వాళ్లకి ఏమాత్రం సమాధానం చెప్పకుండా కార్తీక్ వాళ్ళు వెళ్లిపోతారు. అనసూయ దీప వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని వెతుకుతూ ఉంటుంది. దీప వంటలు చేస్తుంది కదా హోటల్స్ లో వంట చేస్తూ బతుకునుందేమో అనుకుంటుంది. ఏదైనా తన కొడుకు మరియు కోడలిని పట్టుకోవాలని అనసూయ భావిస్తుంది. జ్యోత్స్న నీ ఇంటికి తీసుకుని వస్తాడు కార్తీక్. ఎవరికి ఏం కాలేదు కదా ఎందుకు ఏడుస్తున్నావ్ అని పారిజాతం అంటే సుమిత్ర కోపంగా తప్పు చేయలేదు పరువు తీసింది అని అంటుంది. జ్యోత్స్న నీ గారాబం చేసి చెడగొట్టారని సుమిత్ర పారుని తిడుతుంది.
ఇంటి పరువుని మీడియాలో పెట్టింది.. ఇది మొత్తం పేపర్లో వస్తుంది. తాగి తెలియకుండా కారు నడుపుతుందంటే ఏమనాలని సుమిత్ర కోపగించుకుంటుంది. అనాల్సింది దీన్ని కాదు దీపని అని పారు అరుస్తుంది. జ్యోత్స్న దీప వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏం జరిగిందో తెలియదని దీప ఏడుస్తుంది. తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండాలని పారు అంటే ఆ పని చేయాల్సింది నువ్వు అని శివ నారాయణ ఫైర్ అవుతాడు. నీ నీడ కూడా నా మనవరాలు మీద పడకూడదు అని చెప్పాను ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని అని ఫైర్ అవుతాడు. అది ఆడపిల్ల తెలియక యాక్సిడెంట్ చేసింది దాని పరువు కాపాడడం కోసం ఇరికించాలని చూశాను కానీ దీప వచ్చి నిజం చెప్పేసింది. పోలీసులు తీసుకెళ్లారు. దీనికి కారణం దీప కానీ అందరూ నన్ను అంటున్నారని వారు అరుస్తుంది. పోలీసులు కంప్లైంట్ ఎవిడెన్స్ తోనే వచ్చారని సుమిత్ర దీపని వెనకేసుకొస్తుంది. దీని గురించి ఇక మాట్లాడుకోవద్దని దశరథ చెప్తాడు.
దీప.. జ్యోత్స్న దగ్గర కూర్చుని తన చేతులు పట్టుకుని ఏడుస్తూ నేను నిజం చెప్పి తప్పు చేశానని అర్థం అయ్యింది నన్ను క్షమించు జ్యోత్స్న అంటూ బాధపడుతుంది. జ్యోత్స్న మాత్రం చేతులు చేదరించుకుని కోపంగా వెళ్ళిపోతుంది. పారిజాతం దీపని నానా మాటలు అంటూనే ఉంటుంది. దీప కోసం వెతికి వెతికి అనసూయ అలిసిపోతుంది. తనకి ఫోన్ చేద్దామని అంటే ఫోన్ కూడా పనిచేయడం లేదు.. రేపు ఒక్కరోజు తన కోసం వెతికి ఊరు వెళ్ళిపోవాలని భావిస్తుంది. రోడ్డు పక్కనే నిద్రపోతుంది. ఇక తన మనవరాలు డే పని దగ్గరకు కూడా రానివ్వదని పారు సంతోషపడుతుంది. బంటు వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్తానని చెబుతాడు. ఎందుకని పారు కంగారుపడుతుంది. సుమిత్రాన్ని చంపాలని చూసింది నేనేనని ఒప్పుకోను అని చెబుతాడు.
నన్ను చంపమని చెప్పింది మీరే అని చెప్తాను. ఈ అమ్మగారిని వదిలేసి ఎక్కడికి పోతావని అంటుంది. వదిలేసి పోను నాతో పాటు మిమ్మల్ని జైలుకి తీసుకువెళ్లి కటకటాలు లెక్క పెట్టిస్తా. మీ మనవరాల కోసం నన్ను ఇరికిస్తారా? దేవతల దీప వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది లేదంటే పోలీసులు నన్ను తీసుకెళ్లేవారు. ఇన్నాళ్లు మీ పెదవుల మీద చిరునవ్వు కోసం ఎన్నో చేశాను. కానీ మీరు ఇలా చేస్తారని నాకు తెలీదు. భక్తిని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతావు కదా దాని చెక్ చేయడానికి నీకు ఒక చిన్న పరీక్ష పెట్టానని పారు కవర్ చేస్తుంది. విశ్వాసంలో మీ నాన్న అంతా గొప్పవాడివి కాదు నువ్వు అంటుంది. నాలుగు సెంటి మైండ్ డైలాగులు కొట్టి వాడి మనసు మారుస్తుంది. దీంతో బంటు పారు బుట్టలో పడిపోతాడు… అలా అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!