AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే పోలింగ్ కావడంతో ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. 2014లో మాదిరిగా బీజేపీ.. జనసేన..టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారానికి ఇదే చివరి వారం కావడంతో ప్రధాని మోడీ కూడా ఈ వారంలో ఏపీలో పర్యటించడం జరిగింది. సోమవారం రాజమహేంద్రవరం, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం భారీ బహిరంగ సభలలో పాల్గొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది. ఈ సభలో లోకేష్ కూడా పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది.
ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ రోడ్ షోతో విజయవాడ రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఎటుచూసిన జనంతో నిండిపోయాయి. రోడ్డు పొడవున్న జనాలు మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. దాదాపు 1.5 మీటర్ల మేర చేపట్టిన రోడ్ షోకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.. ఈ రోడ్ షోలో ముగ్గురు కీలక నేతల ప్రజలకు అభివాదం చెబుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోడ్ షోకు 5000 మంది పోలీస్ బందోబస్తుతో హై సెక్యూరిటీ కల్పించారు. ఈ రోడ్ షో విజయవంతం కావడంతో ప్రధాని మోడీ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. విజయవాడలో చేసిన రోడ్ షో గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో పర్యటించిన తర్వాత ప్రజలు ఎన్డీఏకి ఓటేస్తారని విశ్వాసం కలిగిందని స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళలు, యువర్ ఓటర్లు తమకు మద్దతుగా నిలుస్తారని నమ్మకం కలిగిందని ట్వీట్ చేశారు.