Karthika Deepam 2 May 8th 2024 Episode: కారులో జ్యోత్స్న లేకపోవడంతో కార్తీక్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే తనకి ఫోన్ చేస్తాడు. జ్యోత్స్న దీప వాళ్ళని తలుచుకుని రగిలిపోతుంది. ఎక్కడ ఉన్నావ్ అంటే నువ్వు టీ తాగుతూ హాయిగా కబుర్లు చెప్పుకో అని సీరియస్ అవుతుంది. జ్యోత్స్న ఆటోలో రావడం చూసి పారు షాక్ అవుతుంది. ఏమైంది ఎందుకు ఆటోలో వచ్చావని అడుగుతుంది. కార్తీక్ ఎక్కడ అని అంటే కాక హాస్పిటల్ లో టి తాగుతున్నాడు. దీప అక్కడే ఉంది కదా అంటుంది. అది ఎందుకు వచ్చిందని పారు అడుగుతుంది. దీప మీద జ్యోత్స్న చాలా కోపంగా ఉంటుంది. దీపని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం గురించి ఆలోచించమని బంటుకు పారు చెబుతుంది. కార్తీక్.. శౌర్య మాటలు గుర్తు చేసుకుంటాడు. దీపతో మాట్లాడాలని అంటే సరే అయితే నేను కారు దిగి వెళ్ళిపోతుంటే కార్తీక్ ఆపుతాడు.
తనని శత్రువులుగా కాకుండా సుమిత్ర మిత్రులుగా మాత్రమే చూడమని అంటుంది. విషయం ఏంటని అడుగుతుంది. చెప్పే విషయం విని మొహం చాటడాలు.. చెప్పగానే కనుబొమ్మలు ఎత్తి కోపంగా చూడటం.. మధ్యలోనే వెళ్లిపోవడం చేయకుండా తన ఉద్దేశం అర్థం చేసుకోమని అంటాడు. శౌర్య గురించి మాట్లాడుతాడు. శౌర్య కి నేను తన తండ్రి గురించి చెప్తానని భయపడుతున్నారా? మీరు చెప్పేవరకు నేను చెప్పానని అంటాడు. మీరు మాటమీద నిలబడే మనిషి కాదని దీప అంటుంది. మీరు మీ అత్తయ్యతో బయటకు వెళ్లారని రౌడీ చెప్పింది. ఆవిడ ఏది అని అడుగుతాడు. నరసింహ వాళ్లు అటుగా వెళుతూ కార్తీక్ మరియు దీప వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తారు. ఆవిడ ఎక్కడికో వెళ్తుందో అని కవర్ చేస్తుంది. నీ కోడలి అసలు రూపం చూడు. అసలు దీనికి వాడికి ఏం సంబంధం లేకుండా ఇలా మాట్లాడుతుందా అని నరసింహ అనసూయని రెచ్చగొడతాడు.
దే పని కడిగేస్తానని అనసూయ ఆవేశపడుతుంటే నరసింహ ఆపుతాడు. దాని ఏమైనా అంటే వాడు ఊరుకోడు. వాడితో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుందని నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు. మీ అత్త కూడా ఇక్కడికే వచ్చింది కదా ఇక మీరు వెళ్లిపోవాల్సిన అవసరం లేదని అంటాడు కార్తీక్. నరసింహ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్తానని మొత్తం అబద్ధాలు చెబుతాడు. మీరు ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోండి. రౌడీ ని మంచి స్కూల్లో చేర్చండి. నా వంతు సహాయం చేస్తాను అంటాడు కార్తీక్. తనకు అవసరం లేదని అంటుంది దీప. అలా వారి మధ్య కొంత వాదోపవాదాలు జరుగుతాయి. ఆ తరువాత కార్తీక్ మరియు దీప ఇంటికి వస్తారు. వారిని చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. దీప శౌర్య అని పిలుస్తుంది. జ్యోత్స్న నక్లీస్ దీప కొట్టేసిందని పారు నిందలు వేస్తుంది. తీసిన వస్తువు ఎక్కడ పెట్టిందో చెప్పమని అంటుంది. నిజం తెలియకుండా నిందించడం తప్పు అని దశరథ అంటాడు.
అవుట్ హౌస్ కి వెళ్లి అంతా వెతికించమని వస్తువు లేకపోతే అప్పుడు దీప దొంగ కాదని నమ్ముతానని అంటుంది పారు. దీప ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. దీప సమాధానం చెప్పలేక మౌనంగా లేదు మన మీద ఉన్న గౌరవంతో అంటుంది. గ్రానీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదని వెనకేసుకు వస్తుంది జ్యోత్స్న. దీప ఎలాంటిదో నీకు తెలుసు కదా అని కార్తీక్ జ్యోత్స్న నీ అంటాడు. సంస్కారం నేర్చుకోమని అంటే నీ సంస్కారం ఇందాక టీ కొట్టి దగ్గర చూసానని హేళనగా మాట్లాడుతుంది. అసలు ఏం జరుగుతుందని దశరథ అడుగుతాడు. దీప దొంగతనం చేయడం మీరు చూశారా అని కార్తీక్ మరియు దశరథ పారుని నిరదీస్తారు. నక్లీస్ కనిపించడం లేదంటే దాన్ని తీయాల్సిన అవసరం బయట వాళ్లకే ఉంటుంది. జ్యోత్స్న గదిలోకి అంత చనువుగా వెళ్ళేది దీపా తర్వాత శౌర్య. దీప తీయకపోయినా పిల్లలతో చేయించి ఉండవచ్చు కదా అంటుంది పారు. నా కూతురుతో నేను దొంగతనం చేయించానని అంటున్నారా అని దీప బాధగా అడుగుతుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!