Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ సౌత్ సినీ ప్రియలకు అత్యంత సుప్రసిద్ధురాలు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి.. 2012లో పొడా పోడి అనే తమిళ మూవీతో హీరోయిన్ గా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కథానాయికగా తమిళంలోనే కాకుండా మలయాళ, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్న స్థాయిలో ఆమె సక్సెస్ కాలేకపోయింది. పైగా వరలక్ష్మీ కాస్త హోమ్లీ గా ఉండటంతో స్టార్ హీరోలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.
దాంతో లేడీ విలన్ గా వరలక్ష్మి టర్న్ తీసుకుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు మరియు బలమైన సహాయక పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంది. హీరోయిన్లను మించి క్రేజీ సంపాదించుకుంది. ప్రస్తుతం విలన్ గా, సహాయక నటిగానే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కూడా చేస్తూ కెరీర్ను పరుగులు పెట్టిస్తోంది. ఇకపోతే తెలుగులో వరలక్ష్మి శరత్కుమార్ తొలి చిత్రం తెనాలి రామకృష్ణ BA. BL.
సందీప్ కిషన్ హీరోగా జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన కోర్టు రూమ్ యాక్షన్ కామెడీ మూవీ ఇది. ఇందులో వరలక్ష్మీ లేడీ విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత క్రాక్ మూవీలో జయమ్మ పాత్రను పోషించి భారీ స్టార్డమ్ సొంతం చేసుకుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వరలక్ష్మి టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం కావాల్సి ఉంది. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా గతంలో ఓ సినిమా ప్రారంభమైంది.
కానీ షూటింగ్ స్టార్ట్ కాకముందే వీరి కాంబినేషన్ మూవీ ఆగిపోయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు గౌరవం. దర్శకుడు రాధా మోహన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు శిరీష్, యామీ గౌతం జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్ గౌరవం మూవీలో కీలక పాత్రను పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రకాష్ రాజ్ ప్రోడక్షన్స్ మరియూ డ్యుయెట్ మూవీస్ బ్యానర్లపై తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడిన ఈ చిత్రం 2013లో విడుదలైంది.
అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ కి హీరోగా గౌవరం మూవీ తొలిచిత్రం. నటుడిగా ఫస్ట్ మూవీతోనే శిరీష్ మంచి మార్కులు వేయించుకున్నాడు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, రన్ టైమ్ ఎక్కువగా ఉండటం, సగదీత సన్నివేశాలు సినిమాకు యావరేజ్ టాక్ ను తెచ్చాయి. అయితే నిర్మాత ప్రకాష్ రాజ్ మాత్రం రెండు భాషల టీవీ ప్రసార హక్కుల మరియు బాక్సాఫీస్ కలెక్షన్స్ ద్వారా సినిమాకు పెట్టిన బడ్జెట్ ను రికవరీ చేసేశారు. ఇకపోతే గౌరవం సినిమాలో మొదట నాగచైతన్య, వరలక్ష్మి శరత్కుమార్ హీరోహీరోయిన్లుగా సెలెక్ట్ అయ్యారు. నాగార్జున నిర్మాణంలో ఈ సినిమా ప్రారంభం అయింది. నాగచైతన్య, వరలక్ష్మిలపై ఫోటోషూట్ కూడా చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాకముందే అటకెక్కింది. దాంతో వరలక్ష్మి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచమయ్యే అవకాశాన్ని కోల్పోయింది.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!