Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి బిగ్ అప్డేడేట్ వచ్చింది. ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తుండగా.. అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా నిర్మితమవుతుంది.
వైజయంతి మూవీస్ బ్యానర్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ బైరవ అనే పాత్రలో కనిపించనున్నాడు. సూపర్ హీరోస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ జరుపుకుంది. ఇప్పటివరకు ఇండియాలో ఏ దర్శకుడు చూపించని విధంగా నాగ్ అశ్విన్ చూపించడం జరిగింది. ఈ సినిమాలో మరికొంతమంది అగ్ర హీరోలు కూడా అతిథి పాత్రలో నటించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో అతిపెద్ద బ్యానర్ గా పేరు కలిగిన వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో “కల్కి” యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని టాక్. ఈ సన్నివేశాలు చిత్రీకరించటం కోసం హాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదు చేసే కెమెరాలతో..షూట్ చేయడం జరిగిందట. ఇందుకోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ప్రభాస్ ఇప్పటివరకు టచ్ చేయని జోనర్ లో “కల్కి” తెరకెక్కటంతో సినిమా ఫలితంపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సింది. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ కాకపోవటంతో… జూన్ 27వ తారీఖున విడుదల చేస్తున్నారు. గత ఏడాది “సలార్” సినిమా విజయంతో ప్రభాస్ హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. దీంతో “కల్కి” తో హిట్ పరంపర కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!