YSRCP: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 30 నెలలు దాటింది. ఇప్పటి వరకూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ ప్రక్షాళన, ప్రభుత్వ ప్రక్షాళనకు వైఎస్ జగన్ సన్నద్దం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రక్షాళన అంటే మంత్రివర్గ పునర్వవస్థీకరణ, కీలక అధికారుల మార్పులు, చేర్పులు. పార్టీ ప్రక్షాళన అంటే సీనియర్ మంత్రులు, ముఖ్య నేతలతో పార్టీ కమిటీల ఏర్పాటు. త్వరలో మంత్రి వర్గపునర్వస్థీకరణ చేయడానికి జగన్ సన్నద్దం అవుతున్నారు. మరో పక్క ఇటీవలే కీలక అధికారుల మార్పులు జరిగాయి. డీజీపీ సవాంగ్ ను బదిలీ చేసి ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించడం, అదే విధంగా సీఎంఓలో ఉన్న కీలక అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను ఢిల్లీ ఏపి భవన్ కు పంపి ఆయన స్థానంలో టీటీడీ ఇఓ జవహర్ రెడ్డిని సీఎంఓలోకి తీసుకున్నారు.
ఇదే క్రమంలో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మరో కీలక బాధ్యతలను అప్పగించారు. పార్టీ అనుబంధ సంఘాలకు ఇన్ చార్జి గా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు హోదాలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడుగా ఉంటూనే మొన్నటి వరకూ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ బాధ్యతల నుండి ఆయనను తప్పించడంతో విజయసాయి రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గింది అంటూ ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు జగన్ అంతకన్నా పెద్ద బాధ్యతలనే అప్పగించారు. విజయసాయి వ్యతిరేకులు ఈ చర్యలపైనా కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవీ కాలం ముగినుంది. మరో సారి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని జగన్ రెన్యువల్ చేయడం ఖాయమని వార్తలు వినబడుతున్న తరణంలో పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించి కీలక బాధ్యతలను అప్పగించడం రాజ్యసభ రెన్యువల్ లేనట్టేనని ప్రచారం చేస్తున్నారు.
జూన్ లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నాలుగు పదవులకు వైసీపీలో తీవ్రమైన పోటీయే ఉంది. సీఎం వైఎస్ జగన్ ఎవరిని అవకాశం కల్పిస్తారనేది ఎవరి ఊహలకు, అంచనాలకు అందదు. ఒక రాజ్యసభ స్థానం మాత్రం కేంద్రంలోని బీజేపీ సీఫార్సు చేసే అదానీ లాంటి కార్పోరేట్ శక్తికి ఖాయమనే మాట వినబడుతోంది. ఇక మూడు రాజ్యసభ స్థానాలకు జగన్ ఎవరిని ఎంపిక చేయనున్నారో వేచి చూడాలి. విజయసాయిరెడ్డిని పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకోవాలని భావిస్తే మాత్రం రాజ్యసభకు రెన్యువల్ ఉండదని అంటున్నారు.
గతంలోనూ విజయసాయి రెడ్డి పై రకరకాల ఊహగానాలు వచ్చిన సందర్భంలోనూ పార్టీ అధినేత ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నిర్వర్ధించడమే తన కర్తవ్యమని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఒక్కటే యాక్టివ్ గా ఉండగా, ఇతర పార్టీ అనుబంధ సంఘాలు అంతగా యాక్టివ్ గా లేవు. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్న కారణంగా అన్ని అనుబంధ సంఘాలను యాక్టివ్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకే ఆ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారని వార్తలు వినబడుతున్నాయి. రాజ్యసభ అభ్యర్ధిత్వాలపై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on March 2, 2022 1:05 am
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి… Read More
ఏపీలో చిత్రమైన పరిస్తితి కనిపించింది. ప్రస్తుతం పోలింగ్ ముగిసిన తర్వాత.. ఫలితం వచ్చేందుకు జూన్ 4వ తేదీ వరకు సమయం… Read More
ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. 1956లో.. అప్పటి నుంచి జరిగిన అనేక ఎన్నికల్లో చోటు చేసుకోని అనేకానేక ఘటనలు.. తాజాగా జరిగిన 2024… Read More
రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయకులు.. నేడు మరో పార్టీలో ఉన్నారు.… Read More
ఏపీలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలను గమనిస్తే.. చాలా చిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. సాధారణంగా.. ఎన్నికలంటే.. ఒకవైపు తాము ఏం… Read More
ఎన్నికలకు ముందు ఎలాంటి వాతావారణం అయితే.. కూటమి పార్టీల్లో ఉన్నదో.. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా.. అదే… Read More
Brahmamudi:కావ్య మాయా అడ్రస్ ని తెలుసుకొని, ఆమె కోసం ఒక చిన్న గల్లీలోకి వెళుతుంది. అక్కడ కావ్య ని చూసి… Read More
Krishna Mukunda Murari:కృష్ణా, మురారి ఆదర్శ్ తో ముకుంద పెళ్లి జరగాలని భవానీ దేవి నిర్ణయించుకోవడంతో, భవానీకి ఏం చెప్పాలో… Read More
Nuvvu Nenu Prema:విక్కీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడంతో, ఆకలితో ఉన్న ఫ్యామిలీకి అను పద్మావతి ఇద్దరూ, గుడిలో… Read More
May 16: Daily Horoscope in Telugu మే 16 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More
Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More
Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More
Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More
Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More