ఒకే వారంలో రెండు సంఘటనలు – పతాక శీర్షికలతో ప్రాధాన్యత! ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరాన్ని సిబిఐ పోలీసులు అరెస్ట్ చేయడం. ఈ వార్త చాలా సంచలనం కల్గించింది. వివరాలు పరిశీలిస్తే ఐఎన్ఎక్స్ టెలివిజన్ న్యూస్ ఛానల్ వ్యవహారంలో అవినీతి జరిగిందనే విషయానికి సంబంధించి ఈ హడావుడి, వార్తా విశేషం. సిబిఐ పోలీసులు గోడదూకి కస్టడీలోకి తీసుకున్నారని వార్తలు రాగానే ఒకటి, రెండు ఫోటోలతో; చిన్న వీడియోతో చాలాసేపు వార్తను ఇచ్చారు. వార్తాస్థలం ఢిల్లీ కనుకా; సిబిఐ అధికారులే గోడలు దూకినపుడు మీడియాకు ప్రవేశం ఉండే వీలులేదు. రిపోర్టర్తో ఫీల్డ్ రిపోర్టింగ్, లేదంటే ఆ ఛానల్లోనే అందుబాటులో ఉన్న ఎడిటర్తో వ్యాఖ్య చేయించారు.
తెలుగులో దాదాపు అన్ని న్యూస్ఛానళ్లూ ఈ అంశానికి విశేష ప్రాధాన్యత ఇచ్చి, ప్రసారం చేశాయి. ఐతే ఈ విషయంలో ఈటీవీ వారి రెండు తెలుగు వార్తాఛానళ్ళు కాస్త విభిన్నంగా కనబడ్డాయి. ఈ అరెస్ట్ ముందు మాజీ మంత్రి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తనేమీ తప్పు చేయలేదనే చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్మీట్ బైట్కు మిగతా న్యూస్ఛానళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఈటీవీ ఛానళ్ళు మాత్రం ఈ బైట్ను సుమారు తొమ్మిది, పది నిమిషాలలో రెండుసార్లు ప్రసారంచేసినట్లు గమనించాను. ఇంకా ఎక్కువసార్లు ఇచ్చారేమో తెలియదు. ఒకవైపు ఆయన అరెస్ట్ అయ్యారని సిబిఐ పోలీసులు చెబుతుంటే, ఆ దృశ్యాలు అందుబాటులో ఉండగా; ఆయన తప్పు చేయలేదని చెప్పిన పాత వార్తను పదేపదే ఎందుకు ప్రసారం చేయడం? ఇలాంటి పరిశీలనలకు సదరు టీవీ ఛానల్ సమాధానం చెప్పదు. ఫలితంగా ఎవరికి తోచిన వ్యాఖ్యానం వారు చేసుకునే వీలుంది. అది ఛానల్ విశ్వసనీయతకు ప్రమాదం కాగలదు.
చిదంబరం చేసిన తప్పిదాలలో ఐఎన్ఎక్స్ ఛానల్ వ్యవహారానికి సంబంధించి ఇది. ఆ ఛానల్ బాధ్యులు పీటర్ ముఖర్జీ, భార్య ఇంద్రాణి ముఖర్జీ ఇది వరకే సొంత కూతురి హత్యకు సంబంధించి కేసు ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ వ్యవహారంలో ఆవిడ అప్రూవర్గా మారటం ఇటీవలి పరిణామం.
గత బుధవారం (ఆగస్టు 21న) సిబిఐ వారు ఎన్డిటీవీ బాధ్యులు ప్రణయ్ రాయ్ దంపతులపై బ్రైబరీ, ఎఫ్.డి.ఐ. నియమాల అతిక్రమణల విషయమై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశారు. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజమైన జి.ఇ.సంస్థకు చెందిన ఎన్ బి సి యూనివర్సల్ 150 మిలియన్ డాలర్ల కుంభకోణంలో రాయ్ దంపతులు తప్పిదం చేశారని అభియోగం. అంతకు ముందు ఆగస్టు 9న ఐసిఐసిఐ బ్యాంకుకు 48 కోట్ల రూపాయలు నష్టం కల్గించారన్న అభియోగంతో లుక్ అవుట్ నోటీసులు కారణంగా వారిని కెన్యా వెళ్ళకుండా ముంబై ఎయిర్పోర్ట్లో ఆపివేశారు. ఇవి చాలాకాలంగా అడపాతడపా వార్తల్లో వస్తున్న విషయాలే! ఇటీవల ఆ సంస్థ అధికారులు విక్రంచంద్ర, మరో మహిళ రాజీనామా చేశారని సమాచారం.
రాయ్ దంపతులు 1988లో ఎన్డిటీవీ పేరుతో దూరదర్శన్కు ప్రతి శుక్రవారం రాత్రి పదిన్నరకు ‘ది వరల్డ్ దిస్ వీక్’ అనే అరగంట కార్యక్రమం ఇచ్చేవారు. తర్వాతి దశలో స్టార్ న్యూస్కు కేవలం కంటెంట్ ఇచ్చేవారు. ఇంతవరకు బాగానే ఉంది. 2003లో రెండు సొంత ఛానళ్ళు ప్రారంభించడంతో సమస్యలు మొదలయ్యాయని అంటారు. ఈ విషయాలు గమనించినప్పుడు పాత్రికేయులు వాణిజ్యవేత్తలుగా రూపాంతరం చెందినపుడే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వివరాలు ఇలా ఉండగా పాతకేసులు ఇప్పుడు తోడటమేమిటి అనే ప్రశ్న కూడా ప్రధానంగా వినబడుతోంది. పోరాట పథంలో ఛానల్ సాగడం వల్లనే ఇలాంటివని కొందరు విమర్శకులు బిగ్గరగానే అంటున్నారు. ఈ విమర్శలో కూడా నిజానిజాలు పరిశీలించాలి. అయితే అదే సమయంలో సంస్థలను నిర్వహించే పాత్రికేయులు అవినీతిలో భాగస్వాములు కావడం బాధాకరం.
అన్నట్టు ఇటీవల ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో ఒక తమాషా అంశం ప్రసారమైంది. అది పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేసే స్లాట్. అభిమానులకూ, పరామర్శకులకు షేక్హ్యాండ్ ఇవ్వడం వల్ల చంద్రబాబుకు చెయ్యి నొప్పి వచ్చిందని ఒక వివరణాత్మక కథనం ప్రసారం చేశారు. ఇంత ఆలస్యంగా ఇది ప్రసారం చేయడం ఆలోచనాత్మకం.
– డా. నాగసూరి వేణుగోపాల్
This post was last modified on August 26, 2019 1:38 pm
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More