లాక్ డౌన్ తో సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమల్లో ఉద్యోగాలు లేక, కార్మికులు ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. టీచర్లు, ఔట్సోర్సింగ్ కార్మికులు ఇలా పలు రంగాలకు చెందిన వారు ఏడు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారు. ఇలాంటి వారు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఇంతకాలం నెట్టుకొచ్చారు. వాటిని తీర్చలేక ఇంటి అవసరాల కోసం అని అప్పుల యాప్ లపై ఆధార పడుతున్నారు. చిన్న మొత్తంలో అప్పు చేస్తే పర్వాలేదు కానీ, భారీ మొత్తంలో అప్పు చేస్తే అప్పులు వసూలు చేసేందుకు కలెక్షన్ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారు.
వారి తీరు ఎలా ఉంటుందంటే మీ ఫ్రెండ్ రమేష్ కి యాక్సిడెంట్ అయిందని అర్జెంటుగా డబ్బులు పంపండి అంటూ సందేశాలు రావడంతో మిత్రులు వెంటనే రాజేష్ కు ఫోన్ చేశారు. బాగానే ఉన్నాడు అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఆ మెసేజ్లు ఎవరు పంపారో మొదట్లో వారికి అర్థం కాలేదు. ఆరాతీస్తే రాజేష్ ఓ యాప్ ద్వారా తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేక పోయినందున దాని తాలూకు మనుషులు ఇలా బద్నాం చేశారని అని తేలింది. అంతేకాదు మీ ఆయన తీసుకున్న అప్పు తీర్చకపోతే ఇంట్లో ఉన్న వస్తువులను ఎత్తుకు పోతాం అంటూ ఫోన్ లో వచ్చిన బెదిరింపులతో ఓ మహిళ హతశురాలు అయ్యింది. ఆరా తీసిన ఆమె రూ.లక్షలు అప్పు చేసిన ఫలితమని తలపట్టుకుంది. ఈ రెండు సందర్భాల్లో కాల్ చేసింది కలెక్షన్ ఏజెంట్లు వీరంతా వివిధ మనీ లెండింగ్ యాప్స్ కోసం పని చేస్తుంటారు. ఏం చేసినా సరే అసలు, వడ్డీతో సహా రాబట్టేందుకు వారు ఇలా హద్దుమీరుతున్నారు.
ఇటీవల ఐపీఎల్ మొదలైనప్పడు నుంచి ఈ యాప్ల ద్వారా అప్పుచేసే యువకులు విపరీతంగా పెరిగారు. వీరు ఆన్లైన్ గేమ్స్ కోసం భారీగా అప్పులు చేస్తన్నారు.లక్సెట్టిపేటలో ఓ యువకుడు రూ.15 లక్షలు ఇదే రీతిలో అప్పుచేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.రూ.20 వేలలోపు ఉండే చిన్న రుణాల వసూళ్ల లోనూ కలెక్షన్ ఏజెంట్లు ఇష్టానుసారంగా ప్రవర్తించడంతో బాధితులు వాపోతున్నారు. దీనిపై యాప్ల యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే, ‘మా దృష్టికి రాలేదంటూ’ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కంపెనీ సహకారం లేకుండా కాంటాక్ట్స్ కలెక్షన్ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం అసాధ్యమని పలువురు చెబుతున్నారు.
మనీ లెండింగ్ యాప్స్కు మొబైల్ ప్లేస్టోర్స్లో కొదవేం లేదు. ఇందులో రూ.1,000–రూ.15 లక్షల దాకా అప్పులిస్తూ, రూ.1 నుంచి రూ.3 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. అయితే వీటిని డౌన్లోడ్ చేసే క్రమంలో కంపెనీ కి సంబంధించిన కొన్ని షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. చిరునామా, వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ నంబర్ వివరాలు తెలపాలి. విద్యార్థులకైతే ఆధార్, కాలేజీ ఐడీ కార్డు సరిపోతుంది. అలాగే, ఫోన్ కాంటాక్ట్స్ను యాక్సెస్ చేయమంటారా? అని అడుగు తుంది. దీన్ని వినియోగదారులు పట్టించుకోక ‘ఓకే’ కొడుతున్నారు. దీంతో రుణగ్రహీతల ఫోన్ నంబర్లన్నీ యాప్ ద్వారా యాజమాన్యానికి యాక్సెస్ అవుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కలెక్షన్ ఏజెంట్లు.. అప్పు తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్స్లోని ఆత్మీయులు, కుటుంబసభ్యులకు ఫోన్చేసి ఇలా ఇబ్బందులకు గురిచేస్తన్నారు.
చిన్న టిక్ వలన ఎంత పెద్ద ప్రమాదమో చూసారా అందుకే షరతులను ఒకటికి రెండు సార్లు చదివి టిక్ చేయాలి. అంత సులువుగా డబ్బు ఇస్తున్నప్పుడు ఇలాంటి షరతులను వినియోగదారులు పట్టించుకోకుండా తరవాత జరిగే వాటి గురించి ఆలోచించలేక పోతున్నారు.నేటి విద్యార్థులు ప్రమాదకర టెక్నాలజీల మధ్య ఉన్నారు. సెలబ్రిటీల జీవితాలను కాపీ కొట్టేందుకు బెట్టింగ్ కోసం, మనీలెండింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకుం టున్నారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ తరహాలోనే ప్రతీ కాలేజీలో ప్రత్యేక సెల్స్ ఏర్పాటుచేసి విద్యార్థులు ఇలాంటి ఉచ్చులో పడకుండా చూడాలి.వినియోగదారులారా ఇకనైనా మేలుకోండి.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More
Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుదలైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం.… Read More
Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More
NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More
Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More
Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More