YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై భావోద్వేగానికి గురైయ్యారు. తాను అడిగిన ప్రశ్నలకు జగనన్న సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.
రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారనీ, నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా అని ప్రశ్నించారు. జైలులో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది మీరు కాదా అని అడిగారు. నాడు నా భర్త, పిల్లలను వదిలేసి వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాకే గనుక రాజకీయ కాంక్ష ఉంటే అప్పుడే వైసీపీని హైజాక్ చేసేదాన్ని కాదా అని ప్రశ్నించారు. మీ నుండి పైసా సాయం కోరినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు.
ప్రపంచంలో రాజకీయ విభేదాలు ఉన్న వాళ్లు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు. నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా పని చేశానని మనిద్దరం నమ్మే బైబిల్ మీద ఒట్టేసి చెప్పగలనని అన్నారు. నేను పదవి అడిగానని మీరు అదే బైబిల్ పై ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. జగన్ సోషల్ మీడియా ద్వారా నాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న బిడ్డ అన్న ఇంగితం లేకండా, నా పుట్టుకపై రాక్షస సైన్యంతో ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా అని ప్రశ్నించారు. జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని అన్నారు. అందుకే భ్రమల బతుకుతున్నారని విమర్శించారు. జగన్ మానసిక స్థితిపై నిజంగానే ఆందోళన ఉందని అన్నారు. అవినాష్ రెడ్డి నిర్దోషి అని కన్విన్స్ అవ్వాల్సింది మీరు కాదనీ, న్యాయ వ్యవస్థ అని షర్మిల అన్నారు. అవినాష్ దోషి అనేందుకు సీబీఐ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. నిర్దోషి అయితే సీబీఐకి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారని ప్రశ్నించారు.
AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్