ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో నిరసన సెగలు కొనసాగుతున్న వేళ.. బీజేపీ నేత సోము వీర్రాజు రాజధాని నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై చంద్రబాబు తీవ్ర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు తెలివైన రాజకీయం ప్రదర్శిస్తుంటే, ఆయన ట్రాప్ లో జగన్ పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పదేపదే హైదరాబాద్ లాంటి అభివృద్ధి అని ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ వల్లే రాష్ట్ర విభజన ఇబ్బందులు వచ్చాయని సోము వీర్రాజు గుర్తుచేశారు. దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉన్న నవ్యాంధ్రలో చంద్రబాబు తన పాలనలో ఒక్క పోర్టు అయినా నిర్మించారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఈ మాట అంటున్నానంటే తానేదో వైఎస్సార్ను పొగుడుతున్నానని కాదని గుర్తుంచుకోవాలని కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకేలా అభివృద్ధి చెందాలని డిమాండ్ చేశారు. రాయలసీమ రతనాల సీమగా మారాలన్నారు. ప్రస్తుతం పోర్టులు కట్టేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని.. రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. త్వరలో 25 జిల్లాలుగా విభజన చేస్తారని.. బీజేపీ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తోందని సోము వీర్రాజు తెలిపారు.
సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే రాజధానిపై జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్ధతిస్తున్నారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష పార్టీల్లో కొంతమంది జగన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి చెందిన కొందరు నేతలు రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే.
మరోవైపు తుళ్లూరులో ధర్నా చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు.. వంటా వార్పు కార్యక్రమం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీయేతర పార్టీల్లో కొంతమంది జగన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
This post was last modified on December 22, 2019 4:32 pm
POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్ లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్ర… Read More
Ravi Teja: చిత్ర పరిశ్రమలో కథలు ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఒక హీరో… Read More
Big Breaking: ప్రస్తుత కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక ఇటువంటివి సాధారణమైన మనుషులకి… Read More
Kona Venkat: బాపట్ల జిల్లాలో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పై కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి… Read More
Kriti Sanon: టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో కృతి సనన్… Read More
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులతో కలిసి ఫుట్… Read More
Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో చివరి రోజు అయిన… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో... అందరు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్… Read More
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయనను ఓడించాలనే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.… Read More
May 12: Daily Horoscope in Telugu మే 12 – వైశాఖ మాసం – ఆదివారం - రోజు… Read More
Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More
AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More