Janasena: పవన్ కళ్యాణ్ ను కలిసిన విశాఖ సీనియర్ నేత పంచకర్ల .. పార్టీలో చేరికకు మూహూర్తం ఫిక్స్ .. ఎప్పుడంటే..?

Published by
sharma somaraju

Janasena: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఇవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమైయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవల ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పంచకర్ల తన అనుచరులతో మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. తన అనుచరులను పవన్ కళ్యాణ్ కి పరిచయం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

Panchakarla Ramesh Meets Pawan Kalyan Mangalagiri

 

సమావేశం అనంతరం పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి తాను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నానీ, ఇదే విషయం ఆయనతో చెప్పానన్నారు. ఈ నెల 20వ తేదీన తన అనుచరులతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు. పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తాననీ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని తెలిపారు.

ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పంచకర్ల రమేష్ బాబు 2009 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన సందర్భంగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాస్ రావు, అవంతి శ్రీనివాస్ తదితరులతో కలిసి పంచకర్ల టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో యలమంచిలి నుండి రెండో సారి పోటీ చేసినా వైసీపీ గాలిలో ఓటమి పాలైయ్యారు.

విశాఖ రూరల్ లో ఒక్క స్థానం కూడా టీడీపీ గెలవకపోవడంతో నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. ఆ తర్వాత కొద్ది నెలలు సైలెంట్ గా ఉన్న పంచకర్ల 2020 ఆగస్టు నెలలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆశిస్తూ అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అయితే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకే టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తుండటంతో పాటు పంచకచర్ల జనసేనకు వెళ్లే నాయకుడే అని ప్రచారం కూడా చేయడంతో ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం తన అనుచరులతో సమావేశం నిర్వహించారు.

జనసేన పార్టీలో చేరనున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. పంచకర్ల అనుచరులు అందరూ ఆయన నిర్ణయానికి మద్దతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పంచకర్ల మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేరికపై చర్చించగా, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) తన అనుచరులతో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీలో చేరారు. భారీ కార్ల ర్యాలీతో మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమంచి స్వాములుకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

NCP: ఇదేమి రాజకీయం సామీ..’మహా’లో బిగ్ ట్విస్ట్

This post was last modified on July 16, 2023 6:43 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024