ఓడిపోయాక కాడ దించేసిన ఆ నేతలను చూసి ఇపుడు చంద్రబాబు వాపోతున్నారు.మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అంటే ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ ముగ్గురి కారణంగా టిడిపి అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది .ఇప్పుడు అక్కడ పార్టీ జెండా కట్టే కార్యకర్త కూడా కనిపించడం లేదంటున్నారు.విశాఖ జిల్లాలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. గత 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
విశాఖ ఎంపీగా గీతం సంస్థల అధినేత శ్రీభరత్ ను, అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్, అరకు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కిశోర్ చంద్రదేవ్ కు టిక్కెట్ లు ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ముగ్గురూ ఓటమి పాలయ్యారు.విశాఖ ఎంపీగా పోటీచేసిన శ్రీభరత్ తన ఓటమికి టీడీపీ నేతలే కారణమని భావిస్తూ ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాను అధిష్టానానికి ఈ విషయాన్ని నివేదికలతో సహా ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని శ్రీ భరత్ అసహనంతో ఉన్నారని సమాచారం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
ఖర్చు కూడా పార్టీ కోసం పెట్టడం లేదు. ఇటీవల కొందరు పార్టీ కార్యాలయం, కార్యక్రమాల నిర్వహణ కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని శ్రీభరత్ వద్దకు వెళ్లగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది.ఇక అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ వైసీపీలో చేరిపోయారు.ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిశోర్ చంద్రదేవ్ అసలు పార్టీలోనే లేడనుకోవాలి. ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారు. ఇలా విశాఖ జిల్లా లోని మూడు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అనేది లేకుండా పోయిందంటున్నారు.
ఇందుకు నింది౦ చాల్సింది చంద్రబాబునాయుడునేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.ఎన్నికల సమయంలో క్యాష్ సూట్కేసులతో వచ్చేసిన వారికి చంద్రబాబు టిక్కెట్లిచ్చే పంపారని వారు ఓడిపోయాక పార్టీ ముఖం కూడా చూడ్డం లేదని పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.చివరకు వియ్యంకుడు బాలయ్య చిన్నల్లుడు భరత్ కూడా పార్టీకి హ్యాండ్ ఇవ్వడంతో చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారట.అయినా మేకపోతు గాంభీర్యంతో అలా ముందుకు వెళదామంటూ చంద్రబాబు నెట్టుకొస్తున్నారు.
This post was last modified on September 18, 2020 12:56 pm
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More