Komatireddy venkatreddy: జాతీయ పార్టీ కాంగ్రెస్ లో నాయకులకు వాక్ స్వాతంత్రం ఎక్కువ. ప్రాంతీయ పార్టీల మాదిరిగా క్రమశిక్షణ ఉండదు. అది అందరికి తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎవరు తోచిన విధంగా వారు మాట్లాడుతుంటారు. ఆ స్వాతంత్రం ఉంటుంది. పార్టీ స్టాండ్ కు భిన్నంగా కూడా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే..దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా అయన సతీమణి విజయమ్మ హైదరాబాద్ నోవా టెల్ లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరయ్యారు. వైఎస్ ఆర్ అమలు చేసిన సంక్షేమ పధకాలను ఏకరువు పెట్టి ఆయనను స్మరించుకొని నివాళులు అర్పించారు. అంత వరకు బాగానే ఉంది.
అనంతరం వెళ్లే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కు భిన్నంగా ఈ కార్యక్రమంకు హాజరు కావడంపై మీడియా ప్రశ్నించగా కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసినట్లు వదిన విజయమ్మ చెప్పి ఆహ్వానించారు. మూడు రోజుల క్రితమే వస్తాను అని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం కార్యక్రమంలో పాల్గొని అన్న వైఎస్ఆర్ గురించి నాలుగు మాటలు చెప్పాను. ఇది షర్మిల పార్టీ కార్యక్రమం కాదు, ఇక్కడ ఆమె ఫోటోలు, ఫ్లెక్సీ లు లేవు, వేరే పార్టీ కార్యక్రమానికి పాల్గొనలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పని చేశారు. వైఎస్ ఆర్ నా అభిమాన నాయకుడు అందుకే వచ్చాను” అని చెప్పారు.
అంతటితో ఆగకుండా వేరే పార్టీ నాయకుడి ఇంటికి వెళ్లి రాఖి కట్టలేదు అంటూ ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే సీతక్క ను ఉద్దేశించి సెటైర్ వేశారు. మూడు గంటల ముందు నిర్ణయం తీసుకోని కార్యక్రమానికి వెళ్ళవద్దు అని చెపితే వినడానికి చిన్న పిల్లగాడిని కాదు అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే టీ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి చేసిన సంచలన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.
This post was last modified on September 4, 2021 12:35 pm
Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More
Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More
Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More