కడప: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద 54లక్షల మంది రైతు కుటుంబాలకు 8750కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా 15.36లక్షల మంది కౌలు రైతులు కూడా ప్రయోజనం కలుగుతోందని జగన్ పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని రైతు దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ గత ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందనీ, అందుకే రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టామని జగన్ అన్నారు. ప్రతి ఏటా వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని జగన్ పేర్కొన్నారు. అక్టోబర్ 15నుండి వైఎస్ఆర్ భరోసా పథకం కింద 12,500 రూపాయలు అందజేస్తామని జగన్ అన్నారు.
వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళిక రచిస్తున్నామని జగన్ చెప్పారు. గోదావరి జలాలను నాగార్జునసాగర్కు కలపడం వల్ల ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందని జగన్ పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అంగీకారం తెలిపారని జగన్ చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో కడప జిల్లాకు ప్రతిపాదించిన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్ తెలిపారు. కెజి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు కందూ నదిపై రాజోలి, జలదరాశి ప్రాజెక్టు నిర్మిస్తామనీ, డిసెంబర్ 26న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని జగన్ ప్రకటించారు. ఈ నది నుండి ఎత్తిపోతల పథకం ద్వారా బ్రహ్మసాగర్కు నీళ్లు తీసుకొస్తామని జగన్ చెప్పారు. ఈ సభలోనే వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ పథకాన్ని జగన్ ప్రారంభించారు. తాను హామీ ఇచ్చిన ప్రకారం నవరత్న పథకాలను కశ్చితంగా అమలు చేస్తామని జగన్ వాగ్దానం చేశారు. పెన్షన్ రాకుంటే నేరుగా సిఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయాలనీ, ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నెంబర్ ఏర్పాటు చేస్తామని జగన్ అన్నారు. సెప్టెంబర్ ఒకటి నుండి నేరుగా సంక్షేమ ఫలాలు ప్రజల ఇంటికే చేరతాయని జగన్ చెప్పారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పగటి పూట తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తోందనీ, ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుందని జగన్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది డిసెంబర్ 26న కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని జగన్ ప్రకటించారు. మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామనీ, 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ చెప్పారు. రైతాంగానికి మార్కెట్ కమిటీల ద్వారా సక్రమంగా సేవలు అందేందుకు గానూ ఎఎంసిలకు ఎమ్మెల్యేలే గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నట్లు జగన్ తెలిపారు, ఈ సభలో వ్యవసాయ శాఖ మంత్రి కె కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
This post was last modified on July 8, 2019 4:36 pm
ఏపీలో చిత్రమైన పరిస్తితి కనిపించింది. ప్రస్తుతం పోలింగ్ ముగిసిన తర్వాత.. ఫలితం వచ్చేందుకు జూన్ 4వ తేదీ వరకు సమయం… Read More
ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. 1956లో.. అప్పటి నుంచి జరిగిన అనేక ఎన్నికల్లో చోటు చేసుకోని అనేకానేక ఘటనలు.. తాజాగా జరిగిన 2024… Read More
రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయకులు.. నేడు మరో పార్టీలో ఉన్నారు.… Read More
ఏపీలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలను గమనిస్తే.. చాలా చిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. సాధారణంగా.. ఎన్నికలంటే.. ఒకవైపు తాము ఏం… Read More
ఎన్నికలకు ముందు ఎలాంటి వాతావారణం అయితే.. కూటమి పార్టీల్లో ఉన్నదో.. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా.. అదే… Read More
Brahmamudi:కావ్య మాయా అడ్రస్ ని తెలుసుకొని, ఆమె కోసం ఒక చిన్న గల్లీలోకి వెళుతుంది. అక్కడ కావ్య ని చూసి… Read More
Krishna Mukunda Murari:కృష్ణా, మురారి ఆదర్శ్ తో ముకుంద పెళ్లి జరగాలని భవానీ దేవి నిర్ణయించుకోవడంతో, భవానీకి ఏం చెప్పాలో… Read More
Nuvvu Nenu Prema:విక్కీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడంతో, ఆకలితో ఉన్న ఫ్యామిలీకి అను పద్మావతి ఇద్దరూ, గుడిలో… Read More
May 16: Daily Horoscope in Telugu మే 16 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More
Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More
Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More
Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More
Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More
Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More